Karnataka Election Results: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ షురూ.. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Election Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనందున, మే 10న ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు దక్షిణాది రాష్ట్రంలోని 36 నిర్దేశిత కేంద్రాల్లో ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం కౌంటింగ్కు ముందు తెలిపింది.
2024 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య దూకుడు పోరు జరిగింది. 224 అసెంబ్లీ సీట్లలో 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్గా ఉంది.
ఎన్నికల సంఘం ప్రకారం, మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది దక్షిణాది రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం నమోదైందని తెలిసింది. 224 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో సభ్యులను ఎన్నుకునేందుకు 58,545 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 113.
Also Read
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
Read Also: Karnataka Election Results Live Updates: కర్ణాటక తీర్పు.. గెలుపెవరిదో?
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విశ్వాసం వ్యక్తం చేశారు. “హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదు, మేము హాయిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రేపటి వరకు ఆయన (డీకే శివకుమార్) తన 141 సీట్లతో సంతోషంగా ఉండనివ్వండి. ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి మేము శాసనసభ పక్ష సమావేశం నిర్వహిస్తాము” అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. బెంగళూరులోని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నివాసంలో ఈ సమావేశం జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కూడా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో బెంగళూరులోని ఆయన నివాసంలో సమావేశమై ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ వ్యూహంపై చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్లో ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!