kodi Pandalu: సై అంటున్న కోడి పుంజులు.. సిద్ధమైన బరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kodi Pandalu: అధికారులు, పోలీసులు నిర్వహించొద్దని హెచ్చరిస్తున్నా.. రాజకీయ అండదండలతో ప్రతీ ఏడాది సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణ జరుగుతూనే ఉంది.. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.. కోడి పందాలు చూసేందుకు, పందాలు కాసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల వాళ్లు.. అంతెందుకు విదేశాల నుంచి కూడా తరలివస్తున్నారు అంటే.. కోడి పందాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు
Also Read
- Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఏపీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఊరూరా కోడిపందేల బరులను ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాట, కోతముక్క లాంటి జూదాల కోసం కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి.. సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణకు సర్వత్రా రంగం సిద్ధం అయ్యింది.. రేపటి నుండి పండుగ మూడు రోజులు.. ఇదే సమయంలో పెద్ద ఎత్తున కోడిపందాలు కొనసాగనున్నాయి.. కోడి పందాలు నిర్వహణకు బరులు సిద్ధం అయ్యాయి.. బరిలో దిగి పోట్లాడేందుకు కోడి పుంజులు సైతం సై అంటున్నాయి.. కోడి పందాలు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.. ఎన్నికల ఏడాది కావడంతో కోడి పందాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు.. రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా పలుచోట్ల పెద్ద బరులు ఏర్పాటు చేశారు.. రాత్రులు కూడా కోడి పందాలు నిర్వహణకు శిబిరాల్లో ఫ్లేడ్ లైట్లు ఏర్పాటు చేశారు.
Read Also: Lok Sabha Elections: నేడు ఇండియా కూటమి కీలక సమావేశం
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తు్న్నారు. హైటెక్ హంగులు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్ లతో ముస్తాబు అవుతున్నాయి పందెం బరులు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా బరులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం నుంచి భారీ ఎత్తున కోడిపందాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం వంటి మండలాల్లో పందాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమవరం, పాలకొల్లు, వీరవాసరం, యలమంచిలి, నరసాపురం, ఆచంట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పెదవేగి, దెందులూరు, కైకలూరు ఇలా అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి..
తాజావార్తలు
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!