Ajit Doval France Visit: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఫ్రాన్స్లో అజిత్ దోవల్.. రక్షణ సంబంధాలపై చర్చ
- ఫ్రాన్స్ పర్యటనలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- ఫ్రాన్స్తో రక్షణ ఒప్పందాలు..అంతర్జాతీయ అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval France Visit: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్తో రక్షణ ఒప్పందాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రాఫెల్ మెరైన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, స్కార్పెన్ సబ్మెరైన్ల కోసం రెండు దేశాలు చర్చలు జరిపాయి. అంతేకాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం, లెబనాన్ వంటి ప్రాంతాల పరిస్థితులపై కూడా చర్చించారు.
ఈ అంశాలపై ఫ్రాన్స్తో దోవల్ చర్చలు
అజిత్ దోవల్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్నుతో సమావేశమై రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ రంగ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేకాకుండా పౌర అణు సంబంధాలపై కూడా చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ సహకారంపై చర్చించామని లెకోర్న్ ట్విట్టర్లో రాశారు. ఈ సందర్భంగా రాఫెల్ మెరైన్, స్కార్పెన్ సబ్మెరైన్, అంతరిక్ష రంగంలో ద్వైపాక్షిక రక్షణ సహకారంపై చర్చించారు. అలాగే, అంతర్జాతీయ పరిస్థితి, ముఖ్యంగా ఉక్రెయిన్పై చర్చించారు.
Also Read
- Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
Read Also: Bomb Threat: రైల్వే స్టేషన్లపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు!
పశ్చిమాసియా, లెబనాన్లో పరిస్థితిపై చర్చ
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దౌత్య సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోన్ను కూడా దోవల్ కలిశారు. పశ్చిమాసియా, లెబనాన్లోని పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగింది. అంతేకాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారంపై కూడా చర్చించారు. తర్వాత, డోవల్ అధ్యక్షుడు మాక్రాన్తో సమావేశమై, ‘హారిజన్ 2047 రోడ్మ్యాప్’ అమలుకు ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని ఆయనకు తెలియజేశారు.
ప్రధాని మోడీ చొరవకు అభినందనలు
రాయబార కార్యాలయం తరపున, శాంతిని నెలకొల్పడానికి, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాల ప్రాముఖ్యతను ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు. ప్రధాని మోడీ చొరవను అభినందించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!