Ajit Doval France Visit: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఫ్రాన్స్లో అజిత్ దోవల్.. రక్షణ సంబంధాలపై చర్చ
- ఫ్రాన్స్ పర్యటనలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- ఫ్రాన్స్తో రక్షణ ఒప్పందాలు..అంతర్జాతీయ అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval France Visit: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్తో రక్షణ ఒప్పందాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రాఫెల్ మెరైన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, స్కార్పెన్ సబ్మెరైన్ల కోసం రెండు దేశాలు చర్చలు జరిపాయి. అంతేకాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం, లెబనాన్ వంటి ప్రాంతాల పరిస్థితులపై కూడా చర్చించారు.
ఈ అంశాలపై ఫ్రాన్స్తో దోవల్ చర్చలు
అజిత్ దోవల్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్నుతో సమావేశమై రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ రంగ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేకాకుండా పౌర అణు సంబంధాలపై కూడా చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ సహకారంపై చర్చించామని లెకోర్న్ ట్విట్టర్లో రాశారు. ఈ సందర్భంగా రాఫెల్ మెరైన్, స్కార్పెన్ సబ్మెరైన్, అంతరిక్ష రంగంలో ద్వైపాక్షిక రక్షణ సహకారంపై చర్చించారు. అలాగే, అంతర్జాతీయ పరిస్థితి, ముఖ్యంగా ఉక్రెయిన్పై చర్చించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Read Also: Bomb Threat: రైల్వే స్టేషన్లపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు!
పశ్చిమాసియా, లెబనాన్లో పరిస్థితిపై చర్చ
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దౌత్య సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోన్ను కూడా దోవల్ కలిశారు. పశ్చిమాసియా, లెబనాన్లోని పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగింది. అంతేకాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారంపై కూడా చర్చించారు. తర్వాత, డోవల్ అధ్యక్షుడు మాక్రాన్తో సమావేశమై, ‘హారిజన్ 2047 రోడ్మ్యాప్’ అమలుకు ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని ఆయనకు తెలియజేశారు.
ప్రధాని మోడీ చొరవకు అభినందనలు
రాయబార కార్యాలయం తరపున, శాంతిని నెలకొల్పడానికి, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాల ప్రాముఖ్యతను ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు. ప్రధాని మోడీ చొరవను అభినందించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు అని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!