Air india Statement: ఎయిరిండియా ఫ్లైట్ టాయిలెట్లో పాలిథిన్ బ్యాగులు, గుడ్డలు..
- చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
- గత గురువారం ఘటన
- తిరిగి చికాగో విమానాశ్రయంలో ల్యాండింగ్
- సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ
- విమానం టాయిలెట్లలో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది. దీంతో.. చికాగో నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం A-126 అమెరికన్ నగరంలో తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.
Read Also: Champions Trophy 2025: ప్రైజ్మనీ రివీల్ చేసిన ఐసీసీ.. భారత్కు ఎంతంటే..?
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా మాట్లాడుతూ.. విమానం బయలుదేరిన దాదాపు గంటా నలభై ఐదు నిమిషాల తర్వాత బిజినెస్, ఎకానమీ క్లాసులలోని కొన్ని టాయిలెట్లు నిండిపోయాయని సిబ్బంది నివేదించారని చెప్పారు. తదనంతరం విమానంలోని 12 టాయిలెట్లలో ఎనిమిది నిరుపయోగంగా మారాయి.. దీనివల్ల విమానంలో ఉన్న ప్రయాణీకులందరికీ అసౌకర్యం కలిగిందని ప్రకటనలో తెలిపింది.
Read Also: The Paradise: నాని సినిమాలో పీపుల్ స్టార్.. నిజమేనా..?
విమానంలో సమస్య ఉందని సిబ్బందికి తెలియగానే.. విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుంది. అంటే అది అప్పటికే యూరప్లోని ఏదో ఒక ప్రదేశం మీదుగా వెళ్లి విమానం ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. చాలా యూరోపియన్ విమానాశ్రయాలలో రాత్రి కార్యకలాపాలపై ఆంక్షలు ఉన్నందున ఆ విమానాన్ని తిరిగి చికాగోకు తీసుకువచ్చారు. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ రోజు విమానాన్ని తిరిగి చికాగోకు తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. చికాగో నుండి న్యూఢిల్లీకి వెళ్లే విమానం నంబర్ AI126లో ఉపయోగించలేని టాయిలెట్లకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పోస్ట్లు వచ్చాయి. దీని కారణంగా విమానాన్ని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి మళ్లించాల్సి వచ్చింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నప్పుడు.. తమ బృందాలు పాలిథిన్ బ్యాగులు, గుడ్డలు, బట్టలు ఫ్లష్ చేయబడి ప్లంబింగ్లో చిక్కుకున్నాయని కనుగొన్నాయని మేము నిర్ధారించాలనుకుంటున్నాము” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!