AIADMK: అన్నాడీఎంకే ఎన్డీయేతో ఎందుకు విడిపోయింది?.. పళనిస్వామి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK: ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి (NDA) నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్సభ ఎన్నికలకు ప్రత్యేక ఫ్రంట్ను సిద్ధం చేయడం గురించి ఆ పార్టీ మాట్లాడుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. ఆయన ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే విడిపోవడానికి అసలు కారణాన్ని పంచుకున్నారు.
Also Read: Sikkim Cloud Burst: సిక్కింలో ఆకస్మిక వరదలు.. సాయం చేస్తామని దీదీ హామీ
Also Read
- Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్పై అసంతృప్తే కారణమా?
- Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
- Flash Floods: అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదులు.. 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
- ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాషాయ పార్టీతో సీట్ల పంపకాల కారణంగానే రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని ఒక వర్గం మీడియా పేర్కొంటోందని, ఇది తప్పు అని పళనిస్వామి అన్నారు. బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు సంబంధించి పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ బీజేపీ విధాన కూటమి నుంచి ఏఐఏడీఎంకే వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పళనిస్వామి తెలిపారు.”రాష్ట్రంలో జరిగిన సంఘటనలు పార్టీ కార్యకర్తలను బాధించాయి. ఒక కార్యకర్త పార్టీ విజయం, దాని సంక్షేమం కోసం పని చేయాలి. పార్టీ కార్యకర్తల మనోభావాలకు సంబంధించి మా నిర్ణయం.” అని పళనిస్వామి పేర్కొన్నారు.
Also Read: Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి
సెప్టెంబరు 25న జరిగిన పార్టీ సీనియర్ అధికారుల సమావేశాన్ని గుర్తు చేస్తూ, రెండు కోట్ల మంది పార్టీ కార్యకర్తల మనోభావాలను పార్టీ సభ్యులు నాయకత్వానికి తెలియజేసిన తర్వాతే ఎన్డీయే నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు పళనిస్వామి చెప్పారు. మరోవైపు విపక్ష కూటమి ఇండియాపై పళనిస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటును ‘డ్రామా’ అని కూడా అభివర్ణించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిందని, ఇక్కడ సంప్రదాయ ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయని చెప్పారు.
- Tags
- AIADMK
- bjp
- national news
- NDA
- Palaniswami
తాజావార్తలు
-
Anurag Kashyap: మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ డైరెక్టర్.. 11 ఏళ్ల రిలేషన్.. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్!
-
Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్పై అసంతృప్తే కారణమా?
-
Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
-
BJP: రాహుల్ గాంధీ ‘‘హగ్’’ కామెంట్స్.. నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలు బయటకు తెచ్చిన బీజేపీ..
-
Flash Floods: అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదులు.. 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!