Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణమృదంగం మోగుతూనే ఉంది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు పిల్లల్లా రాలిపోతున్నారు. నాందేడ్ ఆస్పత్రి ఘటన జరిగి ఒక రోజు గడవక ముందే మరో రెండు ఆస్పత్రుల్లో పేషెంట్లు చనిపోయారు. నాగ్పూర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్)లో 24 గంటల్లో 14 మంది మరణించారు. ఇదే సమయంలో నగరంలోని మరో ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 9 మంది మరణాలు సంభవించినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 30-అక్టోబర్ 2 మధ్య నాందేడ్ లోని శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఛత్రపతి సంభాజీనగర్ ఆస్పత్రిలో 24 గంల వ్యవధిలో 18 మరణాలు నమోదయ్యాయి.
Read Also: NewsClick: చైనాతో న్యూస్క్లిక్ న్యూస్ పోర్టల్కి సంబంధం.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
బుధవారం ఉదయం 8 గంటల వరకు నాగ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 14 మంది మరణించారని, ఆస్పత్రిలో 1900 పడకల సామర్థ్యం ఉందని, రోజూ సగటున 10 నుంచి 12 మంది రోగులు మరణిస్తారని జీఎంసీహెచ్ డీన్ డాక్టర్ రాజ్ గబ్జియే తెలిపారు. ఆస్పత్రిలో మరణించిన రోగుల్లో ఎక్కువగా చివరి నిమిషాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో అడ్మిట్ అయిన వారే అని.. అటువంటి రోగుల్ని ప్రాణాపాయ స్థితిలో జీఎంసీహెచ్కి తీసుకువస్తారని ఆయన చెప్పారు. విదర్భ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల రోగులు నాగ్పూర్ లో ఉన్న ఈ ఆస్పత్రికి వస్తారని, మరణించిన రోగుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నవారే అని, వీరిలో వెంటిలేటర్ సపోర్టు ఉన్న రోగులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
అంతకుముందు నాందేడ్ లో జరిగిన మరణాల్లో 31 మందిలో 16 మంది పిల్లలు ఉన్నారు. మందులు, సిబ్బంది లోటు ఉండటంతోనే మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే మహరాష్ట్ర శివసేన(ఏక్ నాథ్ షిండే), బీజేపీ, ఎన్సీపీ( అజిల్ పవార్) ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?