Aganampudi Toll Plaza: విశాఖపట్నం ప్రజలకు, స్థానికులకు అధిక భారమైన అగనంపూడి టోల్ ప్లాజా తొలగింపుకు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేయగా.. త్వరలో తొలగిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.. పార్లమెంట్లో ఈ రోజు జీవీఎల్ మాట్లాడుతూ.. కేవలం ఈ ఏడాదిలోనే హైవేలకు 50000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. విశాఖపట్నం సిటీ పాత జాతీయ రహదారిపై ఉన్న అగనంపుడి ప్లాజా వలన స్థానిక ప్రజలపై కొన్ని సంవత్సరాలుగా అధిక భారం పడుతుందన్నారు. సబ్బవరం మరియు అనకాపల్లి మధ్య కొత్త జాతీయ రహదారిని ఇప్పటికే నిర్మించినప్పటికీ అగనంపూడి టోల్ ప్లాజా తీసివేయనందు వల్ల విశాఖ ప్రజలపై అదనపు భారం పడుతుందని.. కనీసం స్థానిక ప్రజలకు కూడా ఎలాంటి మినహాయింపు లేదు. ఫలితంగా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టి అగనంపూడి టోల్ ప్లాజాను తొలగించాలని కేంద్రాన్ని కోరారు జీవీఎల్..
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
ఇక, జీవీఎల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి నిబంధనలను అనుసరించి కాంట్రాక్టర్ కు టోల్ ప్లాజా మంజూరు చేయబడింది. నిబంధనలను అనుసరించి అతనికి ఉన్న కాలపరిమితి ముగియడానికి ముందే దీనిని తొలగించినట్లయితే భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు.. కానీ, జీవీఎల్ లేవనెత్తిన అంశం సహేతుకమైనందువల్ల స్థానిక ప్రజలు ఈ భారాన్ని భరించడం సరి కాదు. వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపి స్థానిక ప్రజలపై పడే భారాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
విశాఖపట్నం ప్రజలకు, స్థానికులకు అధిక భారమైన విశాఖపట్నం సిటీ పాత జాతీయ రహదారిపై ఉన్న అగనంపూడి టోల్ ప్లాజా తొలిగించాలని ఈరోజు రాజ్యసభ లో డిమాండ్ చేశాను.#AndhraPradesh #vizag #visakhapatnam #gvl #cityofdestiny #TollPlaza #BJPGovernment #BJP4IND pic.twitter.com/e6rfCW1gKO
— GVL Narasimha Rao (@GVLNRAO) February 7, 2024