Crime News: భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. దంపతుల ప్లాన్ మూములుగా లేదుగా
- భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం
- అకస్మాత్తుగా ఆ మహిళ భర్త తన జీవితంలోకి ఎంట్రీ
- భార్యాభర్తల మధ్య కుదిరిన సయోధ్య
- దంపతులిద్దరూ కలిసి ప్రియుడి హత్య
పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత భర్తను వదిలేసి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపించింది. తన భర్తకు దూరంగా వెళ్లి ప్రియుడితో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఇద్దరూ కలిసి నెలల తరబడి సంతోషంగా జీవించారు. కానీ.. ఒకరోజు అకస్మాత్తుగా ఆ మహిళ భర్త తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరి వారు ప్రియుడిని హత్య చేశారు. ఆహారంలో విషం కలిపి ప్రేమించిన యువకుడిని మహిళ హత్య చేసింది. హత్య అనంతరం భార్యాభర్తలిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మృతుడు యూపీలోని పిలిభిత్ నివాసిగా గుర్తించారు. రోజూ ప్రియుడు తనను కొట్టి వేధించే వాడని మహిళ తెలిపింది.
Breaking News: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 27 మంది మృతి..
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
- Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
జూన్ 16న మృతుడి మృతదేహం గుర్తించినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. అనంతరం ఈ ఘటనపై విచారించగా అసలు విషయం బయటపటింది. మృతుడితో కలిసి నివసిస్తున్న మహిళ కనిపించకుండా పోయిందని తేలింది. పోస్టుమార్టం నివేదికలో విషం కలిపి హత్య చేసినట్లు నిర్ధారించారు. అనంతరం అతని సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి పోలీసు బృందం చంద్రాచార్య చౌక్ ప్రాంతానికి చెందిన మహిళ, ఆమెతో పాటు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. పోలీస్స్టేషన్లో వారిని విచారించగా వారిద్దరూ దంపతులు అని తేలింది. బాధిత మహిళ పేరు అంజు దేవి, భర్త మధు రాయ్.. వీరు జార్ఖండ్లోని దుమ్కా జిల్లా జర్ముడికి చెందిన వారు.
Wedding Reception: ఘనంగా స్టార్ మా సీరియల్ యాక్టర్స్ శ్రీకర్ మరియు పల్లవి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..
ఈ ఘటనపై ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ.. యువతికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైందని తెలిపారు. ఆమెను భర్త తరచూ కొట్టేవాడని.. అందుకే ఆ మహిళ కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి లక్ష్మణ్ అనే వ్యక్తితో పిలిభిత్లో సహజీవనం చేసినట్లు చెప్పారు. అయితే.. ఆ మహిళను తాను పెళ్లి చేసుకుంటానని మృతుడు తన ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. దీంతో.. పిలిభిత్ లో కలిసి నివాసముంటున్నారు. మరోవైపు.. మహిళ కూడా ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పింది. దీంతో.. ఈ విషయం తన భర్తకు తెలిసింది. ఆ తర్వాత.. మహిళ సోదరుడు ఎనిమిదేళ్ల కొడుకును, భర్తను ప్రియుడికి పరిచయం చేశాడు. అయితే.. ప్రియుడు మహిళపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో.. కొట్టడం, వేధించడం చేశాడు. తన భార్య కొడుతుండటంతో కోపోద్రిక్తుడైన భర్త.. తన భార్యతో కలిసి లక్ష్మణ్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో.. జూన్ 13న ఆహారంలో విషం కలిపి ప్రియుడిని హత్య చేశారు. అనంతరం భర్తతో కలిసి పరారీ అయినట్లు ఎస్పీ సిటీ తెలిపారు.
- Tags
- Crime News
- husband
- Love
- Lover
- murder
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో