Crime News: భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. దంపతుల ప్లాన్ మూములుగా లేదుగా
- భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం
- అకస్మాత్తుగా ఆ మహిళ భర్త తన జీవితంలోకి ఎంట్రీ
- భార్యాభర్తల మధ్య కుదిరిన సయోధ్య
- దంపతులిద్దరూ కలిసి ప్రియుడి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత భర్తను వదిలేసి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపించింది. తన భర్తకు దూరంగా వెళ్లి ప్రియుడితో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఇద్దరూ కలిసి నెలల తరబడి సంతోషంగా జీవించారు. కానీ.. ఒకరోజు అకస్మాత్తుగా ఆ మహిళ భర్త తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరి వారు ప్రియుడిని హత్య చేశారు. ఆహారంలో విషం కలిపి ప్రేమించిన యువకుడిని మహిళ హత్య చేసింది. హత్య అనంతరం భార్యాభర్తలిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మృతుడు యూపీలోని పిలిభిత్ నివాసిగా గుర్తించారు. రోజూ ప్రియుడు తనను కొట్టి వేధించే వాడని మహిళ తెలిపింది.
Breaking News: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 27 మంది మృతి..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
జూన్ 16న మృతుడి మృతదేహం గుర్తించినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. అనంతరం ఈ ఘటనపై విచారించగా అసలు విషయం బయటపటింది. మృతుడితో కలిసి నివసిస్తున్న మహిళ కనిపించకుండా పోయిందని తేలింది. పోస్టుమార్టం నివేదికలో విషం కలిపి హత్య చేసినట్లు నిర్ధారించారు. అనంతరం అతని సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి పోలీసు బృందం చంద్రాచార్య చౌక్ ప్రాంతానికి చెందిన మహిళ, ఆమెతో పాటు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. పోలీస్స్టేషన్లో వారిని విచారించగా వారిద్దరూ దంపతులు అని తేలింది. బాధిత మహిళ పేరు అంజు దేవి, భర్త మధు రాయ్.. వీరు జార్ఖండ్లోని దుమ్కా జిల్లా జర్ముడికి చెందిన వారు.
Wedding Reception: ఘనంగా స్టార్ మా సీరియల్ యాక్టర్స్ శ్రీకర్ మరియు పల్లవి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..
ఈ ఘటనపై ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ.. యువతికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైందని తెలిపారు. ఆమెను భర్త తరచూ కొట్టేవాడని.. అందుకే ఆ మహిళ కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి లక్ష్మణ్ అనే వ్యక్తితో పిలిభిత్లో సహజీవనం చేసినట్లు చెప్పారు. అయితే.. ఆ మహిళను తాను పెళ్లి చేసుకుంటానని మృతుడు తన ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. దీంతో.. పిలిభిత్ లో కలిసి నివాసముంటున్నారు. మరోవైపు.. మహిళ కూడా ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పింది. దీంతో.. ఈ విషయం తన భర్తకు తెలిసింది. ఆ తర్వాత.. మహిళ సోదరుడు ఎనిమిదేళ్ల కొడుకును, భర్తను ప్రియుడికి పరిచయం చేశాడు. అయితే.. ప్రియుడు మహిళపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో.. కొట్టడం, వేధించడం చేశాడు. తన భార్య కొడుతుండటంతో కోపోద్రిక్తుడైన భర్త.. తన భార్యతో కలిసి లక్ష్మణ్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో.. జూన్ 13న ఆహారంలో విషం కలిపి ప్రియుడిని హత్య చేశారు. అనంతరం భర్తతో కలిసి పరారీ అయినట్లు ఎస్పీ సిటీ తెలిపారు.
- Tags
- Crime News
- husband
- Love
- Lover
- murder
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!