ఏడు దశాబ్దల తరువాత గ్రామానికి నీటి సదుపాయం.. కానీ అంతలోనే సీన్ మారిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఊరు ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఎటువంటి సదుపాయాలకు నోచుకోలేదు. కనీసం నిత్యవసరం అయిన నీరు కూడా ఆ గ్రామస్తులకు అందడం లేదు. ఏదో ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. అది కూడా కేవలం 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. వాటినే వారు మూడు రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే కుటుంబం మొత్తం వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఉత్తర్ప్రదేశ్లోని మీర్జాపుర్ జిల్లా లహురియాదహ్ గ్రామస్థుల పరిస్థితి. వీరి గ్రామం కష్టాలు వింటే ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది కదా.
Also Read: Kerala High Court: స్విగ్గీ, జోమాటోలు వద్దు.. పిల్లల్ని తల్లి వండిన ఆహారం రుచిచూడనివ్వండి..
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
అందుకే దేవుడి రూపంలో ఆ జిల్లా కలెక్టర్ అన్నేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న కష్టాలకు దారి చూపించాడు. ఈ కష్టాలు చూసి స్పందించిన మీర్జాపుర్ కలెక్టర్ దివ్యా మిత్తల్ ఇంటింటికీ తాగునీరు అందించే పథకం ‘జల్జీవన్ మిషన్’ కింద గ్రామంలో మంచి నీటి పైపులు, కుళాయిలు ఏర్పాటు చేయించారు. ఆగస్టు 29న గ్రామంలో కొళాయిలు ఏర్పాటు జరిగింది. అయితే ఇది జరిగిన మూడు రోజులకే జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. ఆ తరువాత వారికి నీరు రావడం ఆగిపోయింది. అయితే దీనంతటికి కారణం జల్జీవన్ మిషన్ ప్రారంభోత్సవానికి తమను పిలవకుండా కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని స్థానిక నేతలకు ఆగ్రహం వచ్చింది. వారి తరుపు వారు గ్రామానికి మంచి నీరు వచ్చే పైపులను కట్ చేసేశారు. దీంతో కష్టాలు తీరాయి అనుకుంటే పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చేసింది. ఈ గ్రామం కథ వింటుంటే ఏదో సినిమాలో చూసినట్టు ఉంది కదా. అప్పటి వరకు మిగిలిన గ్రామస్థులతో పాటు మంచినీటి కష్టాలు పడిన స్థానిక నేతలు కూడా ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు వాపోతున్నారు.
తాజావార్తలు
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!