African Union: జీ-20 సమావేశాల్లో కీలక పరిణామం.. ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
African Union Becomes Permanent Member of G-20: ఈరోజు ఉదయం ప్రారంభమైన జీ-20 వన్ ఎర్త్ సెషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీ-20 సమ్మిట్ లో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. సబ్కా సాథ్ భావనతోనే ఆఫ్రికన్ యూనియన్కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని దానికి అందరూ అంగీకరిస్తారని భావిస్తూ ఈ ప్రకటన చేస్తున్నట్లు మోదీ తెలిపారు. జీ20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు అజాలీ అసౌమనీని చైర్ లో కూర్చోవాలని ఆహ్వానించారు. ఆ సమయంలో అజాలీ అసౌమనీ మోడీని ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఇలా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మోడీ.
Also Read:
Karnataka: బ్యాంక్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆ నిర్ణయం తీసుకోనున్న రాష్ట్రప్రభుత్వం
ఈ సమావేశంలో మాట్లాడిన మోడీ మొరాకో భూకంపంలో మరణించిన వారికి సానుభూతి తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ మొరాకోకు సాయం అందించాల్సిన సమయం ఇదని మోదీ అన్నారు. భారత్ ఈ విషయలో పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జీ-20 వేదికపై మోదీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్రం అందరికి ఆదర్శం అన్నారు. దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ వెల్లడించారు. ప్రపంచంలో యుద్దాలు, కరోనా వంటి మహమ్మారి కారణంగా అపనమ్మకం ఏర్పడిందని వాటిని పోగొట్టుకొని ముందుకు సాగాలన్నారు. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం అన్వేషించడానికి 21 శతాబ్దం ఎంతో ముఖ్యమైనదన్నారు. ఇక ఇప్పుడు శాశ్వత సభత్వం పొందించిన ఆఫ్రికన్ యూనియన్ తో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ జీ-20 గ్రూప్ లో భాగంగా ఉన్నాయి. ఇక ఆఫ్రికన్ యూనియన్ విషయానికి వస్తే దీనిలో 55 మెంబర్ స్టేట్స్ ఉండి మొత్తం ఆఫ్రికా ఖండాన్నే ఇది రిప్రెజెంట్ చేస్తుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
G20 Summit in New Delhi admits African Union as permanent member
Read @ANI Story | https://t.co/WDp55u7O54#G20India2023 #G20SummitDelhi #PMModi #AfricanUnion pic.twitter.com/r3S8L89nkF
— ANI Digital (@ani_digital) September 9, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!