ISRO : నేడు ఎల్-1 పాయింట్కి చేరుకోనున్న ఆదిత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత మిషన్ ‘ఆదిత్య’ను పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని ఇస్రో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లో ఈ రోజు నిలిపేందుకు అన్ని సన్నాహాలు చేసింది. L పాయింట్ భూమి, సూర్యుని మధ్య ఉన్న మొత్తం దూరంలో దాదాపు ఒక శాతం. ఆదిత్య సోలార్ అబ్జర్వేటరీని గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపింది.
భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సున్నాగా మారే లేదా నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. ఆదిత్య హాలో కక్ష్యకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించి దానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని హాలో పాయింట్ నుండి బాగా అంచనా వేయవచ్చని ఇస్రో తెలిపింది.
Also Read
- Hardik Pandya: గర్ల్ఫ్రెండ్తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్తో షాక్..!
- Tilak Varma: స్టార్ బాయ్కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్గా ఛాన్స్.!
- CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
ఆదిత్య-ఎల్1ని శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలో ఉంచుతామని ఇస్రో అధికారి ఒకరు శుక్రవారం పిటిఐకి తెలిపారు. ఇది చేయకపోతే ఆదిత్య సూర్యుడి వైపు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని అధికారి తెలిపారు. ఆదిత్య ఎల్-1 అన్ని టెస్టుల్లో పాస్, భూ ప్రభావ పరిధి నుంచి తప్పించుకుని లాగ్రేంజ్ పాయింట్ 1 వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
Read Also:Karnataka: సైన్బోర్డ్లపై 60 శాతం మాతృ భాష.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
ఆదిత్య L1 మిషన్ లక్ష్యం ఏమిటి?
ఇస్రో ప్రకారం, ఈ మిషన్ ప్రధాన లక్ష్యం సౌర వ్యవస్థలో సూర్యుని ఉష్ణోగ్రత, సూర్యుని ఉపరితలంపై జరిగే కార్యకలాపాలు, సూర్యుని మంటలకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు భూమికి సమీపంలో వాతావరణ సంబంధిత సమస్యలను అర్థం చేసుకోవడం. ఇస్రో మిషన్కు దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసింది.
ఆదిత్య L1లో ఏడు పేలోడ్లు
ఆదిత్య L1 ఏడు సైంటిఫిక్ పేలోడ్లతో అమర్చబడి ఉంది. ఈ పేలోడ్లన్నీ ఇస్రో, జాతీయ పరిశోధనా ప్రయోగశాలలచే స్వదేశీంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ పేలోడ్లు విద్యుదయస్కాంత కణం, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని వెలుపలి పొర (కరోనా)ను గమనించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
Read Also:Mahadev Betting App : భూపేష్ బఘేల్ రూ.508 కోట్లు తీసుకున్నాడు… ఈడీ ఛార్జిషీట్లో వెల్లడి
తాజావార్తలు
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Hardik Pandya: గర్ల్ఫ్రెండ్తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్తో షాక్..!
-
Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్గా పని కనిచేస్తున్న రాజమౌళి
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్ప్యాడ్ 11.5 భారత్లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్మ్యాట్ డిస్ప్లే
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!