ISRO : నేడు ఎల్-1 పాయింట్కి చేరుకోనున్న ఆదిత్య..
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత మిషన్ ‘ఆదిత్య’ను పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని ఇస్రో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లో ఈ రోజు నిలిపేందుకు అన్ని సన్నాహాలు చేసింది. L పాయింట్ భూమి, సూర్యుని మధ్య ఉన్న మొత్తం దూరంలో దాదాపు ఒక శాతం. ఆదిత్య సోలార్ అబ్జర్వేటరీని గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపింది.
భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సున్నాగా మారే లేదా నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. ఆదిత్య హాలో కక్ష్యకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించి దానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని హాలో పాయింట్ నుండి బాగా అంచనా వేయవచ్చని ఇస్రో తెలిపింది.
Also Read
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
ఆదిత్య-ఎల్1ని శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలో ఉంచుతామని ఇస్రో అధికారి ఒకరు శుక్రవారం పిటిఐకి తెలిపారు. ఇది చేయకపోతే ఆదిత్య సూర్యుడి వైపు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని అధికారి తెలిపారు. ఆదిత్య ఎల్-1 అన్ని టెస్టుల్లో పాస్, భూ ప్రభావ పరిధి నుంచి తప్పించుకుని లాగ్రేంజ్ పాయింట్ 1 వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
Read Also:Karnataka: సైన్బోర్డ్లపై 60 శాతం మాతృ భాష.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
ఆదిత్య L1 మిషన్ లక్ష్యం ఏమిటి?
ఇస్రో ప్రకారం, ఈ మిషన్ ప్రధాన లక్ష్యం సౌర వ్యవస్థలో సూర్యుని ఉష్ణోగ్రత, సూర్యుని ఉపరితలంపై జరిగే కార్యకలాపాలు, సూర్యుని మంటలకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు భూమికి సమీపంలో వాతావరణ సంబంధిత సమస్యలను అర్థం చేసుకోవడం. ఇస్రో మిషన్కు దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసింది.
ఆదిత్య L1లో ఏడు పేలోడ్లు
ఆదిత్య L1 ఏడు సైంటిఫిక్ పేలోడ్లతో అమర్చబడి ఉంది. ఈ పేలోడ్లన్నీ ఇస్రో, జాతీయ పరిశోధనా ప్రయోగశాలలచే స్వదేశీంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ పేలోడ్లు విద్యుదయస్కాంత కణం, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని వెలుపలి పొర (కరోనా)ను గమనించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
Read Also:Mahadev Betting App : భూపేష్ బఘేల్ రూ.508 కోట్లు తీసుకున్నాడు… ఈడీ ఛార్జిషీట్లో వెల్లడి
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!