Mahadev Betting App : భూపేష్ బఘేల్ రూ.508 కోట్లు తీసుకున్నాడు… ఈడీ ఛార్జిషీట్లో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahadev Betting App : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పేరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జ్ షీట్లో ప్రస్తావించబడింది. బాఘేల్తో పాటు శుభమ్ సోనీ, అమిత్ కుమార్ అగర్వాల్, రోహిత్ గులాటీ, భీమ్ సింగ్, అసీమ్ దాస్ పేర్లను చార్జ్ షీట్లో చేర్చారు. ఇప్పుడు భూపేష్ బఘేల్ పేరు చార్జ్ షీట్లో కనిపించిన తర్వాత అతనికి కష్టాలు పెరిగే అవకాశం ఉంది. అరెస్టయిన నిందితుడు అసీం దాస్ మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్గా భారత్లో కొరియర్గా పనిచేసేవాడని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇటీవల జరిపిన సోదాల్లో అతడి దాచిన స్థలాల నుంచి దాదాపు రూ.5.39 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత అతన్ని అరెస్టు చేశారు.
Read Also:Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి
Also Read
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ఇప్పుడు భూపేష్ బఘేల్ పేరు చార్జ్ షీట్లో కనిపించిన తర్వాత తను చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇటీవల ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేశ్ బఘెల్కు ఈ డబ్బు పంపినట్లు అసిమ్ దాస్ ఏజెన్సీకి తెలిపినట్లు చార్జిషీట్లో వెల్లడైంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్కు మొత్తం రూ.508 కోట్లు ఇచ్చారని అసీమ్ దాస్ తెలిపారు. నిందితుడు అసీమ్ దాస్ డిసెంబరు 12న కొత్త వాంగ్మూలాన్ని నమోదు చేసి, తన పాత వాంగ్మూలాన్ని తప్పుగా ప్రకటించడం గమనార్హం. నవంబర్ 3న భూపేష్ బఘెల్పై తాను చేసిన వాదన తప్పు అని ఆయన అన్నారు. కొందరు ప్రభావవంతమైన వ్యక్తుల ఒత్తిడితో అతను ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే, ఇప్పుడు మళ్లీ తన ప్రకటనను ఉపసంహరించుకుని గతంలో చేసిన మాటకు కట్టుబడి ఉన్నానంటూ చెప్పాడు. నవంబర్ 3, 2023 న, మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఎన్నికల ఖర్చుల కోసం రాజకీయ నాయకుడైన బఘేల్కు కోట్లాది రూపాయలు ఇచ్చారని అసీమ్ దాస్ తెలిపాడు.
Read Also:Bangladesh : బంగ్లాదేశ్ లో రైలుకు నిప్పు.. ఐదుగురు సజీవ దహనం
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు కూడా IIFAకి స్పాన్సర్ చేశారని దీవాన్ చెప్పారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థ రెడ్డి అన్నా బుక్ పేరుతో దుబాయ్లో నిర్వహించబడుతుంది. ఇందులో దాదాపు 3200 ప్యానెల్లు ఉన్నాయి. దీని రోజువారీ సంపాదన సుమారు రూ. 40 కోట్లు. ఇది సుమారు 3500 మంది సిబ్బందిని కలిగి ఉంది. వీరిని 20 వేర్వేరు విల్లాల్లో ఉంచారు. దీని మొత్తం ఖర్చులను మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహణ భరిస్తుంది.
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!