Adi Srinivas: ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది..
- పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారు
- లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుంది
- మీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు
- రైతు భరోసాను మీరు గతంలో జూన్
- జులైలో వేశారు
- రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేసి తీరుతాం - ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక, ఎర్రమట్టి దందా యథేచ్ఛగా నడిపారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుందని విమర్శించారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న మీరు.. 10 ఏళ్లలో ఎంత సంపాదించారు? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించిన నాటి నుండి బూడిదను రైతులకు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా దోపిడి చేసింది మీరు కాదా? అని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Odisha Swearing-In: ఒడిశా సీఎం ప్రమాణస్వీకారానికి “పూరీ జగన్నాథుడికి” బీజేపీ తొలి ఆహ్వానం..
Also Read
పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం పోరాడిండని కేసీఆర్ పొగిడిన సంగతి మరిచారా? అని బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రైతు భరోసాను బీఆర్ఎస్ గతంలో జూన్, జులైలో వేశారని తెలిపారు. మీ అవినీతి, అక్రమాల గురించి విచారణ జరుగుతుందని.. విచారణకు పాడి కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేసి తీరుతామని అన్నారు. హరీష్ మాట మార్చి రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అని రాజీనామా పై మాట్లాడుతుండని పేర్కొన్నారు. మీ దగ్గర ఎమ్మెల్యేలు 39 అని చెబుతున్నారు కాని.. సున్నా కాబోతోందని తెలుసుకోండని ఆది శ్రీనివాస్ తెలిపారు.
Mumbai: భారత్ లోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఓటు సైతం వేసినట్లు గుర్తింపు
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు నిరాధారం.. బేస్ లెస్ ఆరోపణలు పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని మండిపడ్డారు. భార్య పిల్లల పేరుతో రాజకీయాలు చేసే నీచ స్థాయికి దిగజారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తెరవెనుక ఉండి మాట్లాడిస్తున్నారని.. పొన్నం ప్రభాకర్ కు కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!