Adi Srinivas: ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది..
- పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారు
- లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుంది
- మీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు
- రైతు భరోసాను మీరు గతంలో జూన్
- జులైలో వేశారు
- రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేసి తీరుతాం - ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక, ఎర్రమట్టి దందా యథేచ్ఛగా నడిపారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుందని విమర్శించారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న మీరు.. 10 ఏళ్లలో ఎంత సంపాదించారు? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించిన నాటి నుండి బూడిదను రైతులకు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా దోపిడి చేసింది మీరు కాదా? అని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Odisha Swearing-In: ఒడిశా సీఎం ప్రమాణస్వీకారానికి “పూరీ జగన్నాథుడికి” బీజేపీ తొలి ఆహ్వానం..
Also Read
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం పోరాడిండని కేసీఆర్ పొగిడిన సంగతి మరిచారా? అని బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రైతు భరోసాను బీఆర్ఎస్ గతంలో జూన్, జులైలో వేశారని తెలిపారు. మీ అవినీతి, అక్రమాల గురించి విచారణ జరుగుతుందని.. విచారణకు పాడి కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేసి తీరుతామని అన్నారు. హరీష్ మాట మార్చి రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అని రాజీనామా పై మాట్లాడుతుండని పేర్కొన్నారు. మీ దగ్గర ఎమ్మెల్యేలు 39 అని చెబుతున్నారు కాని.. సున్నా కాబోతోందని తెలుసుకోండని ఆది శ్రీనివాస్ తెలిపారు.
Mumbai: భారత్ లోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఓటు సైతం వేసినట్లు గుర్తింపు
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు నిరాధారం.. బేస్ లెస్ ఆరోపణలు పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని మండిపడ్డారు. భార్య పిల్లల పేరుతో రాజకీయాలు చేసే నీచ స్థాయికి దిగజారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తెరవెనుక ఉండి మాట్లాడిస్తున్నారని.. పొన్నం ప్రభాకర్ కు కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?