Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ..ఆసియా కుబేరుల జాబితాలో టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పు చోటు చేసుకుంది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతని సంపద (గౌతమ్ అదానీ నెట్వర్త్) భారీగా పెరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదాని ప్రపంచం సంపన్నుల బాబితాలో 11వ స్థానానికి చేరారు. అతని నికర విలువ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సంపదతో అతను ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టారు. ముఖేష్ అంబానీ నికర విలువ $109 బిలియన్లు దీంతో అతను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు.
READ MORE: Kejriwal: కేజ్రీవాల్కు దొరకని ఉపశమనం.. రేపు జైల్లో సరెండర్
Also Read
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు అనంతరం షేర్ల ధర పెరగడంతో అదానీ సంపద విలువ కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లో అతని నికర విలువ 5.45 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు)కు పైగా పెరిగింది. 2024 సంవత్సరంలో అత్యధికంగా సంపాదిస్తున్న బిలియనీర్లలో గౌతమ్ అదానీ ఒకరని మీకు తెలిసిందే. జనవరి 1, 2024 నుంచి ఇప్పటి వరకు అతడు $26.8 బిలియన్లను సంపాదించారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. 16 నెలల మళ్లీ అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2023 జనవరిలో హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం ఏకంగా 34 శాతం సంపద కోల్పోయారు అదానీ. ఆయనకు చెందిన కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోడవంతో భారత్ తో పాటు ఆసియా, ప్రపంచ సంపన్నుల జాబితాలో చాలా స్థానాలు కోల్పోయారు. కానీ ఏడాది తిరగకుండానే మళ్లీ కోలుకుని తన స్థానాన్ని తిరిగిపొందారు. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
READ MORE: Siddipet: దుబ్బాకలో యువకుల హల్ చల్.. కారుకు అడ్డు వచ్చాడని..!
చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో 14 శాతం వరకు పెరుగుదల కనిపించింది. ట్రేడింగ్ డే ముగిసే సమయానికి, దానిలోని 10 కంపెనీలు లాభాలను ఆర్జించడంలో విజయవంతమయ్యాయి. అదానీ పవర్ స్టాక్లో అతిపెద్ద పెరుగుదల వచ్చింది. అది 14 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే తర్వాత అది 9 శాతం లాభంతో రూ.759.80 వద్ద ముగిసింది. ఇది కాకుండా అదానీ టోటల్ గ్యాస్ 9 శాతం పెరిగి రూ.1,044.50 వద్ద, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 7 శాతం పెరిగి రూ.3416.75 వద్ద, అదానీ పోర్ట్స్ 4 శాతం పెరిగి రూ.1,440 వద్ద ముగిశాయి. అదానీ విల్మార్ 3 శాతం పెరిగి రూ. 354.90కి, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ 2 శాతం పెరిగి 8 శాతం లాభపడగా.. అంబుజా సిమెంట్, ఎసిసి లిమిటెడ్ 2 శాతానికి పైగా పెరిగాయి.
తాజావార్తలు
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!