Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ..ఆసియా కుబేరుల జాబితాలో టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పు చోటు చేసుకుంది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతని సంపద (గౌతమ్ అదానీ నెట్వర్త్) భారీగా పెరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదాని ప్రపంచం సంపన్నుల బాబితాలో 11వ స్థానానికి చేరారు. అతని నికర విలువ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సంపదతో అతను ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టారు. ముఖేష్ అంబానీ నికర విలువ $109 బిలియన్లు దీంతో అతను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు.
READ MORE: Kejriwal: కేజ్రీవాల్కు దొరకని ఉపశమనం.. రేపు జైల్లో సరెండర్
Also Read
సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు అనంతరం షేర్ల ధర పెరగడంతో అదానీ సంపద విలువ కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లో అతని నికర విలువ 5.45 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు)కు పైగా పెరిగింది. 2024 సంవత్సరంలో అత్యధికంగా సంపాదిస్తున్న బిలియనీర్లలో గౌతమ్ అదానీ ఒకరని మీకు తెలిసిందే. జనవరి 1, 2024 నుంచి ఇప్పటి వరకు అతడు $26.8 బిలియన్లను సంపాదించారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. 16 నెలల మళ్లీ అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2023 జనవరిలో హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం ఏకంగా 34 శాతం సంపద కోల్పోయారు అదానీ. ఆయనకు చెందిన కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోడవంతో భారత్ తో పాటు ఆసియా, ప్రపంచ సంపన్నుల జాబితాలో చాలా స్థానాలు కోల్పోయారు. కానీ ఏడాది తిరగకుండానే మళ్లీ కోలుకుని తన స్థానాన్ని తిరిగిపొందారు. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
READ MORE: Siddipet: దుబ్బాకలో యువకుల హల్ చల్.. కారుకు అడ్డు వచ్చాడని..!
చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో 14 శాతం వరకు పెరుగుదల కనిపించింది. ట్రేడింగ్ డే ముగిసే సమయానికి, దానిలోని 10 కంపెనీలు లాభాలను ఆర్జించడంలో విజయవంతమయ్యాయి. అదానీ పవర్ స్టాక్లో అతిపెద్ద పెరుగుదల వచ్చింది. అది 14 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే తర్వాత అది 9 శాతం లాభంతో రూ.759.80 వద్ద ముగిసింది. ఇది కాకుండా అదానీ టోటల్ గ్యాస్ 9 శాతం పెరిగి రూ.1,044.50 వద్ద, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 7 శాతం పెరిగి రూ.3416.75 వద్ద, అదానీ పోర్ట్స్ 4 శాతం పెరిగి రూ.1,440 వద్ద ముగిశాయి. అదానీ విల్మార్ 3 శాతం పెరిగి రూ. 354.90కి, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ 2 శాతం పెరిగి 8 శాతం లాభపడగా.. అంబుజా సిమెంట్, ఎసిసి లిమిటెడ్ 2 శాతానికి పైగా పెరిగాయి.
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!