Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ..ఆసియా కుబేరుల జాబితాలో టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పు చోటు చేసుకుంది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతని సంపద (గౌతమ్ అదానీ నెట్వర్త్) భారీగా పెరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదాని ప్రపంచం సంపన్నుల బాబితాలో 11వ స్థానానికి చేరారు. అతని నికర విలువ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సంపదతో అతను ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టారు. ముఖేష్ అంబానీ నికర విలువ $109 బిలియన్లు దీంతో అతను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు.
READ MORE: Kejriwal: కేజ్రీవాల్కు దొరకని ఉపశమనం.. రేపు జైల్లో సరెండర్
Also Read
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు అనంతరం షేర్ల ధర పెరగడంతో అదానీ సంపద విలువ కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లో అతని నికర విలువ 5.45 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు)కు పైగా పెరిగింది. 2024 సంవత్సరంలో అత్యధికంగా సంపాదిస్తున్న బిలియనీర్లలో గౌతమ్ అదానీ ఒకరని మీకు తెలిసిందే. జనవరి 1, 2024 నుంచి ఇప్పటి వరకు అతడు $26.8 బిలియన్లను సంపాదించారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. 16 నెలల మళ్లీ అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2023 జనవరిలో హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం ఏకంగా 34 శాతం సంపద కోల్పోయారు అదానీ. ఆయనకు చెందిన కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోడవంతో భారత్ తో పాటు ఆసియా, ప్రపంచ సంపన్నుల జాబితాలో చాలా స్థానాలు కోల్పోయారు. కానీ ఏడాది తిరగకుండానే మళ్లీ కోలుకుని తన స్థానాన్ని తిరిగిపొందారు. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
READ MORE: Siddipet: దుబ్బాకలో యువకుల హల్ చల్.. కారుకు అడ్డు వచ్చాడని..!
చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో 14 శాతం వరకు పెరుగుదల కనిపించింది. ట్రేడింగ్ డే ముగిసే సమయానికి, దానిలోని 10 కంపెనీలు లాభాలను ఆర్జించడంలో విజయవంతమయ్యాయి. అదానీ పవర్ స్టాక్లో అతిపెద్ద పెరుగుదల వచ్చింది. అది 14 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే తర్వాత అది 9 శాతం లాభంతో రూ.759.80 వద్ద ముగిసింది. ఇది కాకుండా అదానీ టోటల్ గ్యాస్ 9 శాతం పెరిగి రూ.1,044.50 వద్ద, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 7 శాతం పెరిగి రూ.3416.75 వద్ద, అదానీ పోర్ట్స్ 4 శాతం పెరిగి రూ.1,440 వద్ద ముగిశాయి. అదానీ విల్మార్ 3 శాతం పెరిగి రూ. 354.90కి, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ 2 శాతం పెరిగి 8 శాతం లాభపడగా.. అంబుజా సిమెంట్, ఎసిసి లిమిటెడ్ 2 శాతానికి పైగా పెరిగాయి.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!