Supreme Court : అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court : అదానీ గ్రూప్ – హిండెన్బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిండెన్బర్గ్ నివేదిక నుండి ఉత్పన్నమయ్యే సమస్యపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో ఓపీ భట్, నందన్ నీలేకని, కేసీ కామత్, సోమశేఖర్ సుందరం సభ్యులుగా ఉంటారు. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని కూడా అపెక్స్ కోర్ట్ సెబీని ఆదేశించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొనసాగుతున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. పెట్టుబడిదారులను రక్షించేందుకు నియంత్రణ యంత్రాంగాలను కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also: Meghalaya Election Counting Updates : ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తున్న ప్రస్తుత ఫలితాలు
Also Read
ఫిబ్రవరి 17న పిఐఎల్ల బ్యాచ్పై కోర్టు ఉత్తర్వులను రిజర్వు చేసింది. గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీ స్టాక్లు క్రాష్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ మెకానిజమ్లను పరిశీలించడానికి సభ్యుల పేర్లు, ప్రతిపాదిత కమిటీ పరిధిని సీల్డ్ కవర్లో సూచించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఫిబ్రవరి 17న SC తిరస్కరించింది. ఇప్పుడు కమిటీని నియమిస్తామని, దాని సభ్యులను నామినేట్ చేసి.. పనితీరు పరిధిని రూపొందిస్తామని కోర్టు తెలిపింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక ప్రభావానికి సంబంధించిన PILలపై సుప్రీం కోర్టు తన ఆదేశాలను కూడా రిజర్వ్ చేసింది.
Read Also: Shalu Chourasiya: కేబీఆర్ పార్క్లో నటికి వేధింపులు..! మరోసారి వార్తలోకి నటి చౌరాసియా
ఫిబ్రవరి 17న విచారణ ప్రారంభమైనప్పుడు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కమిటీకి సూచించిన పేర్లను, దాని పని పరిధిని సీల్డ్ కవర్లో పంపిణీ చేశారు. వాస్తవాలు బయటకు వస్తే అది మార్కెట్ పై ప్రభావితమవుతాయని సొలిసిటర్ జనరల్ కమిటీ పేర్కొంది. కేసు పూర్తి పారదర్శకంగా కొనసాగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు. ఫిబ్రవరి 10న, సుప్రీంకోర్టు బెంచ్ జనవరి 24న హిండెన్బర్గ్ నివేదికను విడుదల చేసిన తర్వాత మార్కెట్ అస్థిరత నుండి భారతీయ పెట్టుబడిదారులను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలను సూచించమని మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను కోరింది.
తాజావార్తలు
-
Rohit Sharma 21 Records: ఒక్క సెంచరీ.. 21 రేర్ రికార్డ్స్.. లార్డ్స్లో రఫ్ఫాడించిన రోహిత్ శర్మ!
-
CJP Protest: ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో కీలక పరిణామం..
-
PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
-
Lectrix NDuro: 120KM రేంజ్తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!