Meghalaya Election Counting Updates : ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తున్న ప్రస్తుత ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya Election Counting Updates : మేఘాలయ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు దగ్గర సంబంధం కనిపించినట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) 60 సీట్లలో దాదాపు 20 స్థానాల్లో ముందంజలో ఉంది, తొలి ట్రెండ్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మెజారిటీ మార్కు 31. తృణమూల్ కాంగ్రెస్ 12 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) వరుసగా తొమ్మిది, ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాష్ట్ర ఫలితాలపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాన్రాడ్ సంగ్మా ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదులుకున్నారు. ఈ క్రమంలోనే సంగ్మా మీడియాతో మాట్లాడుతూ అనుకున్న స్థానాల్లో గెలిస్తే జాతీయ స్థాయిలో ఈశాన్య రాష్ట్రాల గళం వినిపించేందుకు పార్టీలతో పొత్తులతో చర్చిస్తామన్నారు. నాలుగు ఎగ్జిట్ పోల్స్ మొత్తం NPP దాదాపు 20 సీట్లు గెలుచుకోవచ్చని సూచించింది.
Read Also: Nagaland Election Counting Updates : నాగాలాండ్లో స్పష్టమైన మోజార్టీతో బీజేపీ కూటమి
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
ఎగ్జిట్ పోల్స్ కూడా 2018లో రాష్ట్రంలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఆరు సీట్లు గెలుచుకుని తన సంఖ్యను స్వల్పంగా విస్తరిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకోవచ్చని, కొత్తగా చేరిన తృణమూల్ కాంగ్రెస్ 11 సీట్లతో ఖాతా తెరవవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ఆ క్రమంలోనే 2018లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే NPPతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సంగ్మా పార్టీపై అవినీతి ఆరోపణలతో విభేదాలు రావడంతో ఈసారి రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఫిబ్రవరి 27న రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 స్థానాల్లో పోలైన ఓట్లను రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో లెక్కిస్తున్నారు. అభ్యర్థి మృతితో సోహియాంగ్ స్థానంలో పోలింగ్ వాయిదా పడింది.
Read Also:Nagaland Election Counting Updates : నాగాలాండ్లో స్పష్టమైన మోజార్టీతో బీజేపీ కూటమి
తాజావార్తలు
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!