Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అందాల నటి ఊర్మిళ మటోండ్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: అందాల నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో రాహుల్తో కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రోటా జిల్లాలోని గారిసన్ పట్టణంలో భారత్ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్గాంధీతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు.కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ఆర్మీ గారిసన్ దగ్గర నుంచి యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే ఊర్మిళ మటోండ్కర్ రాహుల్ గాంధీతో చేరారు, కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు వారికి స్వాగతం పలికేందుకు మార్గం వెంట రోడ్డుపై బారులు తీరారు.ఊర్మిళ మటోండ్కర్(48) సెప్టెంబర్ 2019లో కాంగ్రెస్కు రాజీనామా చేసి, 2020లో శివసేనలో చేరారు.
క్రీమ్-కలర్ సంప్రదాయ కాశ్మీర్ ఫెరాన్ (వదులుగా ఉన్న గౌను), బీనీ క్యాప్ ధరించి ఊర్మిళ మటోండ్కర్ రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ కర్రాతో పాటు వందలాది మంది చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని వారితో చేరారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర గురువారం పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించి సోమవారం జమ్మూ నగరానికి చేరుకుంది. ఈ నెల 30న కశ్మీర్లో యాత్ర ముగియనుంది. అదేరోజు శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
Tamilnadu Minister: పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తమిళనాడు మంత్రి.. వీడియో వైరల్
లడఖ్ టెరిటోరియల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవాంగ్ రిగ్జిన్ జోరా నేతృత్వంలోని 65 మంది సభ్యుల బలమైన లడఖ్ ప్రతినిధి బృందం యాత్ర ప్రారంభంలో గాంధీతో చేరి, తమ ప్రజల సమస్యలు, ఆందోళనల గురించి ఆయనకు వివరించిందని ప్రతినిధి బృందం సభ్యుడు ఒకరు తెలిపారు. కాశ్మీరీ పండిట్ వలస మహిళల బృందం, వారి సంప్రదాయ దుస్తులు ధరించి, పూల రేకులతో రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ప్రసిద్ధ కోల్-కండోలి ఆలయం వెలుపల వేచి ఉన్నారు.
తాజావార్తలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!