Liquor In Train: రైలులో మద్యం తీసుకుపోవచ్చా? తీసుకెళ్తే ఎంత వరకు అనుమతిస్తారంటే..
- రైలులో మద్యం తీసుకుపోవచ్చా?
- తీసుకెళ్తే ఎంత తీసుకెళ్లవచ్చు.
- రైలు ప్రయాణంలో తాగావచ్ఛా?
Liquor In Train: భారతదేశంలో కోట్లాది మంది మద్యం సేవిస్తున్నారు. సమాచారం మేరకు, సగటు భారతీయ పౌరుడు సంవత్సరానికి దాదాపు 4.9 లీటర్ల మద్యం తాగుతాడు. మద్యానికి సంబంధించి భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం, భారతీయ పౌరులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అంతే కాకుండా ఏ ఉద్యోగి కూడా మద్యం సేవించి కార్యాలయానికి వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో, మద్యంతో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉన్న ప్రశ్న. ప్రయాణ సమయంలో మద్యం తీసుకెళ్లడానికి నియమాలు ఏమిటి? ఒక వ్యక్తి ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. అతనికి ఎంత శిక్ష పడుతుంది? అసలు తీసుకెళ్లవచ్చా? ఈ ప్రశ్నలు ఉంటే.. వాటికి సమాధానాలను ఇక్కడ చూద్దాం.
Read Also: MG Hector Plus: రెండు కొత్త వేరియంట్లు ప్రారంభించిన MG.. వివరాలు ఇలా
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
రైలు ఒక ప్రజా రవాణా. ఇందులో వందలాది మంది కలిసి ప్రయాణిస్తుంటారు. అందుకోసం భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక నిబంధనలను రూపొందించింది. తద్వారా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగదు. మద్యానికి సంబంధించిన నిబంధనల గురించి మాట్లాడినట్లయితే.. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులు రైలులో మద్యం తీసుకవెళ్ళవచ్చు. కానీ, రైలులో మద్యం సేవించరాదు. భారతీయ రైల్వే చట్టం 1989 ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఏ ప్రయాణీకుడైనా మద్యం తీసుకెళ్లవచ్చు. అయితే ప్రయాణీకుడు మద్యం అనుమతించబడిన రాష్ట్రాలలో మాత్రమే తీసుకెళ్లవచ్చు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మద్యాన్ని నిషేధించారు. ఈ రాష్ట్రాల్లో గుజరాత్, నాగాలాండ్, బీహార్, లక్షద్వీప్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. దాంతో ప్రయాణికులు అక్కడ మద్యం తీసుకపోలేరు. ఇది మాత్రమే కాదు. ఈ రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ప్రయాణీకులు మద్యం తీసుకెళ్తుంటే, వారికి జరిమానా విధించవచ్చు. వారు జైలుకు కూడా వెళ్లవచ్చు.
Read Also: Accused Arrest: కదులుతున్న ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుడు తన వెంట రెండు లీటర్ల మద్యాన్ని మాత్రమే తీసుకెళ్లవచ్చు. అంతేకాదు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్తున్న 2 లీటర్ల మద్యం బాటిళ్లకు కచ్చితంగా సీల్ వేయాలి. నిబంధనల ప్రకారం.. రైలులో ప్రయాణికులెవరూ ఓపెన్ బాటిళ్లను తీసుకెళ్లకూడదు. ఒక వ్యక్తి రైలులో మద్యం సేవిస్తూ పట్టుబడితే, రైల్వే చట్టం ప్రకారం ఆ వ్యక్తికి జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు. అంతే కాకుండా ప్లాట్ఫారమ్పై మద్యం సేవించి, బహిరంగంగా మద్యం బాటిల్ను తీసుకెళ్తుంటే పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
-
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?