Liquor In Train: రైలులో మద్యం తీసుకుపోవచ్చా? తీసుకెళ్తే ఎంత వరకు అనుమతిస్తారంటే..
- రైలులో మద్యం తీసుకుపోవచ్చా?
- తీసుకెళ్తే ఎంత తీసుకెళ్లవచ్చు.
- రైలు ప్రయాణంలో తాగావచ్ఛా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor In Train: భారతదేశంలో కోట్లాది మంది మద్యం సేవిస్తున్నారు. సమాచారం మేరకు, సగటు భారతీయ పౌరుడు సంవత్సరానికి దాదాపు 4.9 లీటర్ల మద్యం తాగుతాడు. మద్యానికి సంబంధించి భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం, భారతీయ పౌరులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అంతే కాకుండా ఏ ఉద్యోగి కూడా మద్యం సేవించి కార్యాలయానికి వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో, మద్యంతో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉన్న ప్రశ్న. ప్రయాణ సమయంలో మద్యం తీసుకెళ్లడానికి నియమాలు ఏమిటి? ఒక వ్యక్తి ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. అతనికి ఎంత శిక్ష పడుతుంది? అసలు తీసుకెళ్లవచ్చా? ఈ ప్రశ్నలు ఉంటే.. వాటికి సమాధానాలను ఇక్కడ చూద్దాం.
Read Also: MG Hector Plus: రెండు కొత్త వేరియంట్లు ప్రారంభించిన MG.. వివరాలు ఇలా
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
రైలు ఒక ప్రజా రవాణా. ఇందులో వందలాది మంది కలిసి ప్రయాణిస్తుంటారు. అందుకోసం భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక నిబంధనలను రూపొందించింది. తద్వారా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగదు. మద్యానికి సంబంధించిన నిబంధనల గురించి మాట్లాడినట్లయితే.. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులు రైలులో మద్యం తీసుకవెళ్ళవచ్చు. కానీ, రైలులో మద్యం సేవించరాదు. భారతీయ రైల్వే చట్టం 1989 ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఏ ప్రయాణీకుడైనా మద్యం తీసుకెళ్లవచ్చు. అయితే ప్రయాణీకుడు మద్యం అనుమతించబడిన రాష్ట్రాలలో మాత్రమే తీసుకెళ్లవచ్చు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మద్యాన్ని నిషేధించారు. ఈ రాష్ట్రాల్లో గుజరాత్, నాగాలాండ్, బీహార్, లక్షద్వీప్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. దాంతో ప్రయాణికులు అక్కడ మద్యం తీసుకపోలేరు. ఇది మాత్రమే కాదు. ఈ రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ప్రయాణీకులు మద్యం తీసుకెళ్తుంటే, వారికి జరిమానా విధించవచ్చు. వారు జైలుకు కూడా వెళ్లవచ్చు.
Read Also: Accused Arrest: కదులుతున్న ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుడు తన వెంట రెండు లీటర్ల మద్యాన్ని మాత్రమే తీసుకెళ్లవచ్చు. అంతేకాదు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్తున్న 2 లీటర్ల మద్యం బాటిళ్లకు కచ్చితంగా సీల్ వేయాలి. నిబంధనల ప్రకారం.. రైలులో ప్రయాణికులెవరూ ఓపెన్ బాటిళ్లను తీసుకెళ్లకూడదు. ఒక వ్యక్తి రైలులో మద్యం సేవిస్తూ పట్టుబడితే, రైల్వే చట్టం ప్రకారం ఆ వ్యక్తికి జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు. అంతే కాకుండా ప్లాట్ఫారమ్పై మద్యం సేవించి, బహిరంగంగా మద్యం బాటిల్ను తీసుకెళ్తుంటే పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?