NTV Telugu Site icon

Bus Accident: ప్రైవేట్ స్కూల్‌ బస్సు బోల్తా.. విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

School Bus

School Bus

Bus Accident: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలోని కాటేదాన్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వంపుగా ఉన్న ప్రాంతంలో డ్రైవర్‌ బస్సును నిలపగా.. స్కూల్‌ అయిపోగానే చిన్నారులు బస్సు ఎక్కారు. వంపులోకి బస్సు మెల్లగా కదిలింది. ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బస్సు బోల్తా పడింది. బస్సులో ఉన్న చిన్నారులకు గాయాలు కాగా.. పాఠశాల యాజమాన్యం సమీపంలోని ఆస్పత్రులకు తరలించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు ఉండగా.. 30 మంది చిన్నారులకు గాయాలైనట్లు తెలుస్తోంది. బ్రేక్‌ ఫెయిల్ కావడంతోనే బస్సు అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో ట్రైజిన్‌ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్.. 6 నెలల్లో కార్యకలాపాలు షురూ..