మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలోని కాటేదాన్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినిలు గాయపడ్డారు. సూర్యాపేట కు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా.. నకిరేకల్ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.