NTV Telugu Site icon

ACB Rides: ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్‌..

Rajamallaiah

Rajamallaiah

ACB Rides: ఇప్పటికి చాలా చోట్ల ప్రభుత్వ పనులు చేయించుకోవడానికి అధికారులు లంచాన్ని తీసుకోనిదే పనులు చేయడంలేదు. ఇందుకు సంబంధించిన విశేషాలు ప్రతిరోజు ఏదో ఒక మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే.. అది ఇవ్వడానికి ఇష్టపడని వారు ఏసీబీ అధికారులను కలిసి ఆ లంచకొండి అధికారులను పట్టిస్తుంటారు. ఇదేవిధంగా తాజాగా లంచం తీసుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్.రాజా మల్లయ్య లంచం డిమాండ్ చేసి తీసుకునందుకు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు.

Mystery of Death: సనత్ నగర్లో ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ లోని రాంనగర్‌కు చెందిన ఎనిశెట్టి సుదర్శన్ అనే వ్యక్తి నుండి 50 వేలు లంచం తీసుకున్నట్టు ఏసీబీ విచారణలో నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మల్లయ్య నుంచి లంచం సొమ్మును రికవరీ చేసి రసాయన పరీక్ష నిర్వహించగా.. లంచం తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Viral Video: లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పోలార్డ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?