ACB Rides: డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఏసీబీ సోదాలు.. వెలుగులోకి భారీ అవినీతి
- డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఏసీబీ సోదాలు.
- పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.
- హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఇతర ప్రాంతాల్లో సోదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Rides: ట్రాన్స్పోర్ట్ శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఏసీబీ అధికారులు హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఇతర ప్రాంతాల్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల సహా మొత్తం 8 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పుప్పాల శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు రూ. 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
Also Read: SA20 2025: ముచ్చటగా మూడోసారి ఫైనల్కు దూసుకెళ్లిన సన్రైజర్స్
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
ఏసీబీ సోదాల్లో ఏమేం బయటపడ్డాయన్నా విషయానికి వస్తే.. హైదరాబాద్లో ఉన్న విలాసవంతమైన ఇల్లు.. జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో భూములు, వరంగల్లో ఉన్న భారీ స్థలాలు, బ్యాంకు అకౌంట్లలో నగదు నిల్వలు, బంగారం, విలువైన ఆభరణాలు బయట పడ్డాయి. పుప్పాల శ్రీనివాస్పై గత కొంతకాలంగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఆస్తుల విలువను అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ దాడుల అనంతరం పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు డీటీసీ పుప్పాల శ్రీనివాస్ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఆధారాలు సమీకరించి, మరింత లోతుగా దర్యాప్తు జరపనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసేవారు అవినీతి ఊబిలో కూరుకుపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
ట్రెండింగ్
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!