ACB Raids: ఏసీబీకి చిక్కిన బంజారాహిల్స్ సీఐ నరేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంజారాహిల్స్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న.. నరేందర్ లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు చిక్కారు. బంజారాహిల్స్ లోని స్కైలాంజ్ పబ్ ఓపెనింగ్ కు యాజమాని నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పబ్ యాజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వెంటనే బంజారాహిల్స్ పీఎస్లో సోదాలు చేశారు. పబ్ నుంచి తొలుత 4.5 లక్షలు బంజారాహిల్స్ సీఐ నరేందర్ డిమాండ్ చేశాడని స్కై లాంజ్ పబ్ ఓనర్ ఏసీబీ అధికారులకు వెల్లడించాడు. చివరిగా సీఐ నరేందర్తో 3 లక్షల రూపాయలను డీల్ కుదుర్చుకున్నట్లు పబ్ ఓనర్ ఏసీబీ అధికారులకు తెలిపాడు. ఇందులో 50 వేల రూపాయలను గతంలో సీఐకు పబ్ ఓనర్ చెల్లించాడు.. ఆ డబ్బులు ఇచ్చే సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు అని ఏసీబీకి చెప్పాడు.
Read Also: Wamiqa Gabbi: సెన్సార్ లేదని.. నగ్నంగా చూపించేస్తారా.. ?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
దీంతో సీఐ నరేందర్ ఇంట్లో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇక, ఏసీబీ అధికారులు సీఐను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. ఈ వ్యవహారంలో ఎస్ఐ నవీన్రెడ్డి, హోంగార్డ్ హరిని కూడా ఏసీబీ విచారిస్తుంది. ఇక, సీఐ నరేందర్ ఇంట్లో భారీ మొత్తంలో నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఒక పెద్ద సైజ్ బ్యాగ్.. నోట్స్ కౌంటింగ్ మెషీన్ తీసుకొని వెళ్లారు. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో సీఐ భారీగా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా సీఐ నరేందర్ పై వరుస ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ విచారిస్తున్నారు.
Read Also: Putin: రష్యా నుంచి భారత్ని దూరం చేసే ప్రయత్నాలు ఫలించవు..
ఏసీబీ అధికారులు తీసుకెళ్లిన బ్యాగులో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం.. పబ్బులు, స్పాలలో అక్రమ వసూళ్లకు నరేందర్ పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా కేసుల్లో సీఐ నరేందర్ పై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ సివిల్ మ్యాటర్ లో కూడా సీఐ నరేందర్ తల దూర్చినట్టు తెలుస్తుంది. సదరు సివిల్ మ్యాటర్లోని నరేందర్ పై ఏసీబీ రైడ్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురితో పాటు మిగతా ఎస్ఐలను ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. పక్కా ఆధారాలతో ఏసీబీ రైడ్స్ చేస్తుంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!