హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కుమారుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, బడా బిల్డర్లతో కుమ్మక్కై TDR ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలను HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ BV కృష్ణ కుమార్ నష్టం చేసినట్లు గుర్తించారు. ఇక, బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు ACB అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి దాదాపు 3800 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది.
మరో ఇద్దరు HMDA ప్లానింగ్ అధికారుల పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగ్ లో TDR విలువ తగ్గించి.. తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వంకి నష్టం కలిగించింది.
Read Also: Sonia Gandhi: బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలి..
ఫైల్స్ కి అనుమతినిచ్చిన కృష్ణ కుమార్, మరో ఇద్దరు HMDA ప్లానింగ్ ఆఫీసర్లు.. శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే అమెరికాకు కృష్ణ కుమార్ వెళ్లిపోయారు. అమెరికా నుంచి హైదరాబాద్ కి ACB అధికారులు ప్రయత్నిస్తున్నాను.. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్ మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సిండికేట్ పై ఏసీబీ దృష్టి పెట్టింది. టీడీఆర్ నష్టాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.