Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Acb Arrests Hariram And Remands Him

Kaleshwaram ENC Hariram: ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం.. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు

Published Date :April 27, 2025 , 4:02 pm
By RameshVaitla
  • ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం
  • 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు
  • హరిరామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది ఏసీబీ
Kaleshwaram ENC Hariram: ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం.. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా ఆస్తులు కూడాబెట్టుకున్న అవినీతి అధికారి ఏసీబీ భరతం పట్టింది. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణలో కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడి జరిపింది. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించింది. హరిరామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది ఏసీబీ.

Also Read:Pahalgam terror attack: ‘‘హిందువునని గర్వంగా ప్రాణత్యాగం చేశాడు’’.. నా భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వండి..

తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. 24గంటల నిర్విరామంగా జరిపిన ఏసీబీ సోదాల్లో కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. హరి రామ్ అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఏకకాలంలో భారీగా సోదాలు జరిపింది. తెలంగాణ, ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అక్రమ ఆస్తుల గుర్తించింది ఏసీబీ. గజ్వెల్ లో ఏసీబీ మొదట దాడులు జరిపిండి. ఇక ఈ దర్యాప్తు కాస్త, హరి రామ్‌కు చెందిన అక్రమ ఆస్తులపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ షేక్‌పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లోని విల్లాలు, ఫ్లాట్లు, ఏపీ అమ రావతిలోని కమర్షియల్ ఫ్లాట్‌లతో పాటు, మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను కూడా గుర్తించింది ఏసీబీ.

Also Read:BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..

టోలిచౌకిలోని హరిరాం లగ్జరీ విలాస్ లోని ఆయన నివాసంలో 8 బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపాయి. 24 గంటల పాటు నిర్విరామంగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. ఈ రోజు తెల్లవారు జామున 2 గంటలకు సోదాలు ముగిసాయి. తెల్లవారు 3గంటలకు హరిరారం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు జడ్జి ఇంట్లో హరి రామ్‌ను ప్రొడ్యూస్ చేయడంతో జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Also Read:MI vs LSG: ప్లేఆప్స్ రేసులో ముందుకు దూసుకెళ్లేది ఎవరో? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్.

ఏసీబీ సోదాల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు ఏసీబీ గుర్తించిన ఆస్తుల విలువ సుమారుగా రూ.200 కోట్లు కాగా, వీటి బహిరంగ మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే 10 రెట్లు అధికంగా ఉందని అంచనా. కాలేశ్వరం enc హరి రామ్ ఆస్తుల పై ఏసీబీ విచారణలో భారీగా అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ 13 చోట్ల భారీగా నివాస స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణంలు ఉన్నట్లు గుర్తించింది. ENC హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో 13 చోట్ల ఏసీబీ సోదాలు జరపగా గజ్వెల్ లో భారీగా ఆస్తుల లను కలిగి ఉన్నట్లు గుర్తించిది ఎసిబి. షేక్ పేట్ , కొండపూర్ విల్లాలు.. శ్రీనగర్,నార్సింగి, మాదాపూర్ ఫ్లాట్స్ గుర్తించింది.

Also Read:ACB Raids: కాలేశ్వరం ఈఎన్సీ హరి రామ్ ఆస్తులపై కొనసాగుతున్న విచారణ

ఏపీ అమరావతిలో కమర్షియల్ భవనం ఉన్నట్లు ఏసీబీ కనుగొంది. మార్కుక్ మండలంలో 28ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చేరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లు గుర్తించింది. వీటితో పాటు 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ కొత్తగూడెం కుబ్బులాపూర్ మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్ల గుర్తించింది. కొండాపూర్, షేక్‌పేట మాదాపూర్, కోకాపేట సంజీవరెడ్డి నగర్ లో భారీ భవనాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. ఇక సిద్దిపేట జిల్లా కొత్తగూడెం పట్టణం మిర్యాలగూడ పట్టణంలో ఫామ్ హౌస్ లు మామిడి తోటలు భవనాలు గుర్తించింది ఏసీబీ. బీఎండబ్ల్యూ కార్ తో సహా బంగారు ఆభరణాలు, స్వాధీనం చేసుకుంది ఏసీబీ.
పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు స్వాధీనం చేసుకుంది. ఈఎన్సీ హరి రామ్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించింది ఏసీబీ.

Also Read:Hyderabad: హైదరాబాద్లో దారుణం.. ఆటోను వెంబడించిన యువకులు.. ఒకరు మృతి

కాళేశ్వరం ఈఎన్సీ హరి రామ్ పై దాడులు కొనసాగించేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధం అయ్యారు. ఇక, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుబ్బులాపూర్, మిర్యాల గూడలో ఓపెన్ ప్లాట్లను కూడా అధికారులు గుర్తించారు. ఆయన వద్ద బీఎండబ్ల్యూ కార్, భారీగా బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. కొండాపూర్ షేక్‌పేట, మాదాపూర్ కోకాపేట్ సంజీవరెడ్డి నగర్ కుత్బుల్లాపూర్ ఎల్లారెడ్డిగూడ, పటాన్ చెరు, యాదగిరిగుట్ట, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా కొత్తగూడెం పట్టణం, మిర్యాలగూడ పట్టణంలో భారీగా స్థిరాస్తులు గుర్తించింది ఎసిబి. వీటితో పాటు పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు కూడా అధికారులు సీజ్ చేశారు.

Also Read:CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్‌లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..

కాలేశ్వరం కమిషన్ బోర్డు ఎండిగా ఉన్న హరి రామ్ ఇంటికి 8 ఏసీబీ బృందాలు చేరుకోవడం సంచలం రేపింది. నిన్న తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన సోదాలు ఈ రోజు తెల్లవారు వరకు కొనసాగాయి. ఓ వైపు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన పిసి గోష్ కమిటీ సిద్ధం చేసినా నివేదిక కీలకంగా మారింది. దీనికి తోడు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా ఓ రిపోర్ట్ అందించింది. ఇలాంటి క్రమంలో హరి రామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరగడం పెద్ద సంచలనం రేపింది. పిసి ఘోష్ రిపోర్టు, NDSA రిపోర్ట్ ఆధారంగానే ఈ ఏసీబీ సోదాలు జరిగాయి.

Also Read:Priyadarshi : ప్రియదర్శికి పెరుగుతున్న మార్కెట్.. కమెడియన్ గా మానేస్తాడా..?

గతంలో కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ హరి రామ్ అత్యంత కీలకంగా వ్యహరించారు. ఇక కమిషన్ల రూపంలో రుణాల చెల్లింపులు సమయంలో అక్రమంగా వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు కూడా దీనికి తగ్గట్టుగా పలు ఆధారాలు సేకరించారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో ఏసీబీ సోదాలు జరగడం సంచలనం రేపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ హరిరామ్‌ను విచారించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29 వేల 737 కోట్ల రూపాయల వరకు తిరిగి చెల్లించినట్లుగా విచారణలో హరి రామ్ చెప్పాడు.

Also Read:Minister Subhash: జగన్ మానసిక స్థితి సరిగా లేదు.. లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారు..!

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో 64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని విచారణలో స్పష్టం చేశాడు హరి రామ్. ఇక కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని చెప్పాడు. అయితే.. హరిరామ్‌ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భార్యా భర్తలిద్దరూ కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసిబీ గుర్తించింది. ఈ కేసులో తగిన ఆధారాలతో ఏసిబి అధికారులు సోదాలు జరిపి హరి రామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

Also Read:Andhra Pradesh: హైస్కూల్‌ గ్రౌండ్‌లో పడిన పిడుగు.. ఇద్దరు విద్యార్థులు మృతి

కాలేశ్వరం ఇంజనీర్ చీఫ్ హరిరామ్ అతని సతీమణి అనిత ఇద్దరు భారీగా అక్రమ ఆస్తుల కూడగట్టినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. హరిరామ్ ను అరెస్ట్ చేసిన ఏసిబి అధికారులు రిమాండ్ కు తరలించారు. హరి రామ్ అతని సతీమణి అనితపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ACB Raids
  • Gajwel Properties
  • Hari Ram
  • Hari Ram Arrest
  • Illegal Assets

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్!

  • UAE: “మీ యుద్ధం మాతో కాదు, తెలివిలోకి రండి”.. ఇరాన్‌పై యూఏఈ ఆగ్రహం..

  • Israel: ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టండి’’.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు..

  • Pakistan: “భారత్‌తో పోటీ పడేంత సీన్ లేదు”.. సొంత టీమ్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ ఫైర్..

  • Pakistan: పాకిస్తాన్‌‌‌కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..

  • Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions