ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా ఆస్తులు కూడాబెట్టుకున్న అవినీతి అధికారి ఏసీబీ భరతం పట్టింది. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణలో కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడి జరిపింది. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించింది. హరిరామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది ఏసీబీ. Also Read:Pahalgam terror attack: ‘‘హిందువునని గర్వంగా ప్రాణత్యాగం…
కాలేశ్వరం ఈఎన్సీ హరి రామ్ ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో అవి వందల కోట్లు విలువ చేస్తాయంటున్నారు ఏసిబి అధికారులు. కాళేశ్వరం ఈఎన్సీ హరి రామ్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. 13 చోట్ల భారీగా నివాస స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఈఎన్సీ హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో 13 చోట్ల ఏసీబీ…