CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..
- పాక్ మీడియాలో సంచలనంగా సీఎం సిద్ధరామయ్య కామెంట్స్..
- ‘‘పాకిస్తాన్తో యుద్ధం వద్దంటు కామెంట్స్’’..
- సిద్ధరామయ్య ‘‘పాకిస్తాన్ రత్న’’అంటూ బీజేపీ సెటైర్లు..
CM Siddaramiah: కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్ వ్యాప్తంగా హెడ్లైన్గా నిలిచారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, దీని గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్తో యుద్ధం వద్దని, పాకిస్తాన్తో యుద్ధానికి తాను అనుకూలం కాదు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలనే పాకిస్తాన్ మీడియా సంస్థలు హైలెట్ చేస్తూ వార్తా కథనాలను నివేదించింది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ‘‘మనం యుద్ధానికి వెళ్లకూడదని ఎప్పుడు చెప్పలేదు’’ అని అన్నారు.
సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయనను ‘‘పాకిస్తాన్ రత్న’’ అంటూ పిలిచింది. సర్వత్రా విమర్శలు రావడంతో సీఎం ఈ రోజు మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్తో మనం ఎప్పుడూ యుద్ధం చేయకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదు, యుద్ధం పరిష్కారం కాదని నేను చెప్పాను. పర్యాటకులకు రక్షణ ఇవ్వాలి. ఇది ఎవరి బాధ్యత? వైఫల్యం జరిగిందని నేను చెప్పాను ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. భారత ప్రభుత్వం తగినంత భద్రత కల్పించలేదు. యుద్ధం విషయానికొస్తే, అది అనివార్యమైతే, మనం యుద్ధానికి వెళ్లాలి’’ అని అన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Alos: Pakistan: పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే.. ఒక్క మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు..
అంతకుముందు, పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడంతో సిద్ధరామయ్య వివాదానికి తెరతీశారు. కఠినమైన భద్రతా చర్యలు ప్రారంభించాలని, యుద్ధం చేయడానికి మేము అనుకూలంగా కాదని, శాంతితో ఉండాలని, ప్రజలు సురక్షితంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లను నిర్ధారించాలని అని ఆయన శనివారం అన్నారు.
ఈ వ్యా్ఖ్యలపై పాకిస్తాన్ ప్రముఖ వార్తా సంస్థ జియో న్యూస్ సహా పాకిస్తాన్ మీడియా కర్ణాటక సీఎం వ్యాఖ్యల్ని కవర్ చేసింది. ‘‘భారత దేశం నుంచి యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు’’ అని పాక్ మీడియా అభివర్ణించింది. జియో న్యూస్ బులెటిన్ నుంచి ఓ క్లిప్ని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘‘సరిహద్దు అవతల నుంచి వజర్-ఎ-లా సిద్ధరామయ్యకు పెద్ద శుభాకాంక్షలు. పాకిస్తాన్ మీడియా సిద్ధరామయ్యని ప్రశంసిస్తోంది. పాకిస్తాన్ తో యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీ, ప్రజలు నిరాశ చెందారు’’ అని పోస్టులో పేర్కొన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ప్రస్తావిస్తూ విజయంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న సింధు జల ఒప్పందంపై నెహ్రూ సంతకం చేసినందుకు పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉంది కాబట్టి, నెహ్రూను రావల్పిండి వీధుల్లో ఓపెన్ జీపులో తీసుకెళ్లారు. పాకిస్తాన్లో ఓపెన్ జీపులో తీసుకెళ్లబడే భారతదేశం నుండి తదుపరి రాజకీయ నాయకుడు సిద్ధరామయ్య అవుతారా?’’ అని అడిగారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక, సిద్ధరామయ్యను ‘‘పాకిస్తాన్ రత్న’’గా అభివర్ణించారు. మీ వ్యాఖ్యలతో మీరు రాత్రికి రాత్రే పాకిస్తాన్లో ప్రపంచ ప్రసిద్ధి చెందారని అన్నారు. అయితే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిద్ధరామయ్య వ్యా్ఖ్యలపై మాట్లాడేందుకు నిరాకరించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!