Abortions: అత్యంత విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో పెరిగిన గర్భస్రావం కేసులు.. కారణాలు..?
- కేరళలో పెరుగుతున్న గర్భస్రావం కేసులు
- 9 ఏళ్లలో 76% పెరిగిన గర్భస్రావాలు
- ఆందోళన కరమంటున్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గర్భస్రావం చేయించుకోవడంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక మహిళ గర్భస్రావం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళితే, ఆమెను చాలా ప్రశ్నలు అడుగుతారు. కారణం తెలియకుండా చేయడానికి చాలా ఆసుపత్రులు నిరాకరిస్తాయి. ఇదిలా ఉండగా.. అత్యధిక విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో మాత్రం గర్భస్రావం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
READ MORE: Kartik Maharaj: 6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ప్రకారం.. కేరళలో గత 9 సంవత్సరాలలో గర్భస్రావ కేసులు 76% కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ నివేదిక ప్రకారం.. 2014-15లో మొత్తం 17,025 గర్భస్రావాలు జరిగాయి. 2023-24లో దాదాపు 30,000 గర్భస్రావ కేసులు నమోదయ్యాయి. వీటిలో 21,282 కేసులు ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదయ్యాయి. 8,755 కేసులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యాయి. 2015-16 నుంచి 2024-25 వరకు, కేరళలో మొత్తం 1,97,782 గర్భస్రావాలు నమోదయ్యాయి. వీటిలో 67,004 మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యాయి. మిగతా 1,30,778 మొత్తం గర్భస్రావాలు ప్రైవేట్ ఆసుపత్రులలో చేయించారు. ఇందులో మహిళల ఇష్టపూర్వకంగా, ఇష్టం లేకుండా చేసిన గర్భస్రావాలు రెండూ ఉన్నాయి.
చాలా మంది గర్భస్రావాలను తప్పుగా చూస్తారు. వాస్తవానికి, చాలా గర్భస్రావాలు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ కొన్ని గర్భస్రావాలు మాత్రం బలవంతంగా చేయిస్తారు. కొందరు పెళ్లికి ముందే తప్పటడుగు వేసి గర్భం దాల్చిన వాళ్లు కూడా ఉంటారు. గర్భస్రావం కోసం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఎంచుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడటం పెరగడానికి ప్రధాన కారణం గోప్యత అని వెల్లడిస్తున్నారు. అంటే.. ప్రైవేట్లో చేయించుకుని ఎవ్వరికీ తెలియకుంగా జాగ్రత్తపడతారు. ఏదేమైనా అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో గర్భస్రావం కేసులు పెరగడం ఆందోళన కరమే అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!