MS Dhoni: క్రిమినల్ కేసు నమోదు.. ఎంఎస్ ధోనీ మాజీ బిజినెస్ పార్టనర్ అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాజీ బిజినెస్ పార్టనర్ మిహిర్ దివాకర్ అరెస్ట్ అయ్యాడు. ధోనీ క్రిమినల్ కేసు నమోదు అనంతరం పోలీసులు అతడిని జైపుర్లో అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకొన్నారని రాంచీ జిల్లా కోర్టులో మూడు నెలల క్రితం దివాకర్తో పాటు సౌమ్యా దాస్పై ధోనీ ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు జైపుర్లో దివాకర్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సౌమ్యా దాస్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయడానికి 2017లో ఎంఎస్ ధోనీతో మిహిర్ దివాకర్కు చెందిన ‘ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్’ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లోని వాటాను మహీకి ఆర్కా స్పోర్ట్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్కా స్పోర్ట్స్.. మహీకి డబ్బు చెల్లించడంలో విఫలమైంది. ఈ విషయంపై మిహిర్ దివాకర్, సౌమ్య దాస్తో ధోనీ పలుమార్లు చర్చించినా… ఫలితం లేకపోయింది. దాంతో ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగాడు.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
Also Read: Hardik Pandya: 4.3 కోట్ల రూపాయలు మోసపోయిన పాండ్యా సోదరులు!
2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్కు ఇచ్చిన అథారిటీ లెటర్ను కూడా ఎంఎస్ ధోనీ రద్దు చేసుకున్నాడు. ఆపై లీగల్ నోటీసులు కూడా పంపించారు. మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ల నుంచి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ధోనీ కోర్టును ఆశ్రయించాడు. రాంచీ కోర్టులో ఇద్దరిపై క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. ఆర్కా స్పోర్ట్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిమా కారణంగా ధోనీకి రూ.15 కోట్ల నష్టం వాటిల్లినట్లు మహీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు దివాకర్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. సౌమ్యా దాస్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!