AAP: స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల.. సీఎం సతీమణికి చోటు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత.. పార్టీలో అయోమయం నెలకొంది. ప్రచారం ఎవరు నిర్వహిస్తారా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఆ అనుమానాలను పటాపంచల్ చేస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను మంగళవారం ఆప్ విడుదల చేసింది. గుజరాత్లో ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్లను వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Actor Died: ఇండస్ట్రీకి షాక్.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఈ జాబితాలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, రాఘవ్ చద్దా, మంత్రి అతిషి, ఇసుదన్ గాధ్వి తదితరులు జాబితాలో ఉన్నారు. అనూహ్యంగా రాఘవ్ చద్దా పేరు కూడా ఉండడం విశేషం. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత రాఘవ్ చద్దా ఎక్కడా? కనిపించలేదు. దీంతో ఆయన కూడా అరెస్ట్ భయంతో పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. కానీ అనూహ్యంగా ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. దీంతో మరిన్ని రోజులు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. కానీ ప్రచారం చేసేందుకు మాత్రం ఆయనకు అవకాశం లేకుండా పోయింది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పేరు వెల్లడించారు. మరీ ఆయన ప్రచారం ఎలా నిర్వహిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Yarlagadda VenkatRao: సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!