ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ముందడుగు వేసింది. దర్యాప్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-22 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులు పొందినట్లుగా గుర్తించింది. ఈ మేరకు సోమవారం హోంమంత్రిత్వశాఖకు ఈడీ తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం , ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనలను ఆప్ ఉల్లంఘించిందని తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్ ఈ మొత్తాన్ని స్వీకరించినట్లు ఈడీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Voting: 8 సార్లు ఓటు వేసిన యువకుడు.. వీడియో వైరల్
విదేశీ దాతల వివరాలతో పాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఈప్ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. దాతల వివరాలను తప్పుగా ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు పేర్కొంది. ఆప్, పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తన దర్యాప్తుల్లో వెల్లడైందని ఈడీ వెల్లడించింది.
అంతేగాక 2016లో కెనాడాలో నిధుల సేకరణ కార్యక్రమంలో సేకరించిన నిధులను, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్తో సహా పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది. అనికేత్ సక్సేనా (ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్), కుమార్ విశ్వాస్ (ఒకప్పటి ఆప్ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్), కపిల్ భరద్వాజ్ (అప్పటి ఆప్ సభ్యుడు), దుర్గేష్తో సహా వివిధ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఇ-మెయిల్లలోని విషయాల ద్వారా ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఇదిలా ఉంటే ఈడీ ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ తోసిపుచ్చింది. ఇది పార్టీ పరువు తీసేందుకు రాజకీయ కుట్ర అని నొక్కి చెప్పింది.
ఇది కూడా చదవండి: AI for Google Search: ఇక గూగుల్ సెర్చ్ లో కుడా ఏఐ.. ఈ 8 ఫీచర్లు అస్సలు మిస్ కావద్దు!