Aadi srinivas: బీసీ బిడ్డ కాకపోయినా.. సీఎం బీసీ బిల్ తీసుకువచ్చారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi srinivas: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ రాజకీయాల్లో నువ్వా..నేనా.. అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణమని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలన్న విషయంలో బీజేపీకి స్పష్టతే లేదు. బీసీ బిల్లుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాల్సిందని రఘునందన్ రావుపై విమర్శలు గుప్పించారు. కానీ, ఆయన అది చేయకుండా కాంగ్రెస్పై విమర్శలు చేయడం దారుణమని.. బీసీ బిల్లు అమలవకూడదని ఆయన కోరుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ అన్నారు.
Also Read
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
- Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
అలాగే.. బీజేపీ అగ్రకుల పార్టీ. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. భవిష్యత్తులో అన్ని రంగాల్లో బీసీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. మా పీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ.. మీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు..? బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వమని అధిష్ఠానాన్ని ఎందుకు అడగరు..? అని రఘునందన్ రావును ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం మాటలకే పరిమితం కాదని. మన్మోహన్ సింగ్ లాంటి నేతను రెండుసార్లు ప్రధానిగా చేసిన ఘనత మాదే అని అన్నారు. ఇలాంటివి బీజేపీకి సాధ్యం కాదని, బీసీ బిడ్డ కాకపోయినా మా సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లు తెచ్చారని అన్నారు. ఇది సామాజిక న్యాయం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనంఅంటూ కొనియాడారు.
HHVM : పార్ట్ 2 పై వీరమల్లు టీమ్ క్లారిటీ..
బీజేపీ కేంద్రంలో ఉండి బీసీ బిల్లును ఆమోదించకపోతే, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక బిల్లును ఆమోదిస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని.. బీసీల గురించి ఖచ్చితమైన ఆలోచన ఉంటే, ఇప్పటికీ కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదం తెలిపేదని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!