Aadi Srinivas : కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు?
- తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా?
- సీఎం రూ.లక్ష 79 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు? తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచ ఆర్థిక దిగ్గజాల ముందు ఉంచి రూ. లక్ష 79 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే కిషన్ రెడ్డికి ఏం నొప్పి అని విమర్శించారు. బీఆర్ఎస్ పాటనే కిషన్రెడ్డి పాడుతున్నారన్నారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాని మీరు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తారా? అని మండిపడ్డారు.
READ MORE: Manchu Vishnu: టాలీవుడ్లో నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..
Also Read
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
“దావోస్కు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం వెళ్లలేదా? బీజేపీ ముఖ్యమంత్రులతో పోటీ పడి కంపెనీలను ఆకట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు.. తన ప్రసంగంతో పెట్టుబడి దారులను సీఎం రేవంత్ రెడ్డి ఆకట్టుకున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్కు పెట్టుబడిదారులు ఫిదా అయ్యారు.. దావోస్ నుంచి తీసుకువచ్చిన పెట్టుబడులను చూసి కిషన్ రెడ్డి గర్వించాలి.. ప్రశ్నించే గొంతుల దగ్గరకు సీబీఐ, ఈడీని బీజేపీ పంపిస్తోంది.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్రం సహకరించాల్సింది పోయి విమర్శలా? కిషన్ రెడ్డి శాపనార్థాలు పెట్టేలా మాట్లాడటం సరైనది కాదు.. చేతనైతే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలి.. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకమైనా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందా? ఎక్కడైనా రైతు రుణమాఫీ చేశారా? కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు.. పేదల కోసం పథకాలు ప్రవేశపెట్టింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాలే.. బీఆర్ఎస్ నలుగురికి దోచి పెడితే బీజేపీ ఆ ప్రభుత్వం ఆ ఇద్దరికి దోచి పెడుతోంది..” అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చేసిన కృషిని విమర్శిస్తున్న కిషన్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు.
READ MORE: Bandi Sanjay: అలాంటి వారిని బీజేపీలో చేర్చుకోం.. బండి సంజయ్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!