Love Cheating: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి.. మోజు తీరాక..!
- ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన యువకుడు
- యువతిని గర్భవతిని చేసి గర్భస్రావం చేయించిన యువకుడు
- యువతి తల్లిదండ్రులకు తెలిసిన విషయం
- పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో యువకుడు పరారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి తీరా మోజు తీరిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఆ ఘనుడు ముఖం చాటేశాడు. గర్భవతి అని తెలిసి మందుల ద్వారా గర్భస్రావం చేయించాడు. విషయం కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో అసలు బాగోతం బయటపడింది. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో ఆ ఘనుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శ్రీనివాసపురంలో చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన సతీష్ అనే యువకుడు పెళ్లి చేసుకోమని కోరితే ముఖం చాటేస్తున్నాడు.
Read Also: Minister Ram Prasad: ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను జగన్ ఓర్వలేకపోతున్నాడు..
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
కొవ్వూరు శ్రీనివాసపురంలో ఉన్న ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇదే ప్రాంతానికి చెందిన దాసరి సతీష్ అనే యువకుడు ముగ్గులో దింపాడు. ప్రతిరోజు స్కూలుకు వెళుతున్న తమ కుమార్తె వెనుక సతీష్ వెంట పడుతున్నాడని తల్లిదండ్రులు గ్రహించారు. కుమార్తెను మందలించి తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పంపించారు. అక్కడ కూడా ఇద్దరు మధ్యన ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో కామ వాంఛ తీర్చుకున్నాడు. చివరకు గర్భవతిని చేశాడు.
Read Also: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
మెడిసిన్స్ ద్వారా గర్భస్రావం కూడా చేయించాడు. యువతికి అధిక రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు తెలిసి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు తల్లిదండ్రులు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడు సతీష్ని పెళ్లి చేసుకోమని అడిగారు. దీంతో.. సతీష్ ముఖం చాటేసాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులు కొవ్వూరు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు పై పోలీసులు సతీష్ పై కేసు నమోదు చేసి బాలిక మైనర్ కావడంతో యువకుడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సతీష్ పరారీలో ఉన్నాడు. ఇతన్ని పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!