తన మరదలును ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని పొట్టన పెట్టుకున్నాడు. ప్రేమించొద్దని చెప్పి మాటలతో చెప్తే సరిపోయేది ఉండేది. వినకపోతే.. పోలీసుల చేతనైనా చెప్పించాల్సింది. కానీ.. అనవసరంగా ఓ యువకుడిని దారుణంగా హతమార్చాడు. సినిమా తరహాలో తన స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఓ అమ్మాయి ప్రేమ వలన నిండు ప్రాణం బలైంది. రోజు సమాజంలో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా.. హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఓ యువకుడిని దారుణంగా చంపేశారు.
Read Also: Lifestyle : ఈ కారణాల వల్లే ఆడవాళ్లు పెళ్లంటే భయపడుతున్నారట..
వివరాల్లోకి వెళ్తే.. తన మరదలు పై కన్నేసాడని తన మిత్రులతో కలిసి యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ బేగంపేటలోని పాటిగడ్డలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. పాటిగడ్డకు చెందిన ఉస్మాన్ అనే యువకుడు స్థానిక యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ అజజ్.. తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి పాటిగడ్డలో ఉంటున్న అతని దగ్గరికి వెళ్లి రాత్రి సమయంలో యువకుడిని అడ్డగించారు. ఆ తర్వాత.. నలుగురు యువకులు కలిసి ఉస్మాన్ పై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా చంపేశారు. అతని ప్రాణం పోయిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగి పోయారు. హత్య జరిగిన ప్రాంతాన్ని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్తో పాటు పలువురు పోలీసు ఉన్నత అధికారులు పరిశీలించి.. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఈ మర్డర్ పై కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన అజజ్, ఫిరోజ్, సాహిల్, రెహన్ ను విచారిస్తున్నారు.
Read Also: Speaker Election: నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక.. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు..