Man Suicide: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య.. కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Suicide: నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఊరు వదిలి కర్నూలు వెళ్లి హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు బాల నరసింహులు.
Also Read: Road Accident: పండగ పూట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి
Also Read
రెండు రోజుల క్రితం బాల నరసింహులు చింతకుంటకు వచ్చాడు. గతంలో కేసు పెట్టినవారితో బాల నరసింహులుకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారిని పోలీస్స్టేషన్కు పిలిపించి ఎస్సై మల్లికార్జున మాట్లాడారు. ఎస్సై బాల నరసింహులుపై చేయి చేసుకున్నట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం నరసింహులు నంద్యాల జీజీహెచ్లో చేరాడు. అర్ధరాత్రి జీజీహెచ్ నుంచి వెళ్లిపోయి రైలు కింద పడి బాల నరసింహులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మల్లికార్జున కొట్టినందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!