Man Suicide: నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఊరు వదిలి కర్నూలు వెళ్లి హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు బాల నరసింహులు.
Also Read: Road Accident: పండగ పూట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి
రెండు రోజుల క్రితం బాల నరసింహులు చింతకుంటకు వచ్చాడు. గతంలో కేసు పెట్టినవారితో బాల నరసింహులుకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారిని పోలీస్స్టేషన్కు పిలిపించి ఎస్సై మల్లికార్జున మాట్లాడారు. ఎస్సై బాల నరసింహులుపై చేయి చేసుకున్నట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం నరసింహులు నంద్యాల జీజీహెచ్లో చేరాడు. అర్ధరాత్రి జీజీహెచ్ నుంచి వెళ్లిపోయి రైలు కింద పడి బాల నరసింహులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మల్లికార్జున కొట్టినందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.