Drugs: చిన్న బ్యాగ్లో రూ.30 లక్షల డ్రగ్స్.. సరఫరా చేస్తున్న మహిళ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు తమ లగేజీలను బ్యాగ్ లలో తీసుకువెళతారు. అయితే.. అందులో ఏముంటుందన్న విషయం పక్కన కూర్చే వారికి తెలియదు. కానీ.. స్మగ్లర్లు రైలు ప్రయాణం ద్వారానే.. కోట్లాది విలువ చేసే డ్రగ్స్ ను రాష్ట్రాలు దాటిస్తున్నారు. సమాచారం అందితే దొరికేవి కొన్నైతే.. దొరకనివి చాలా ఉన్నాయి. తరుచూ మనం చూస్తూనే ఉంటాం.. రైళ్లలో డ్రగ్స్ తరలిస్తున్నారని.. పట్టుబడ్డారన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
అయితే.. లక్నోలోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తోంది. చూడటానికి ప్రయాణికురాలిగా ఉన్నప్పటికీ.. అనుమానం వచ్చి చూస్తే, ఆమె వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. అనంతరం ఎస్టీఎఫ్ (STF) బృందం ఆమెను అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి చార్బాగ్ రైల్వే స్టేషన్లోని మూడో నంబర్ ప్లాట్ఫారమ్పై చీర కట్టుకున్న మహిళ బ్యాగ్తో నిలబడి ఉంది. అయితే.. అక్కడే ఉన్న పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగ్ని తెరిచి చెక్ చేయగా.. అందులో రూ.30 లక్షల విలువైన నల్లమందు కనిపించింది. దీంతో వెంటనే ఆ మహిళను అరెస్ట్ చేశారు.
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!
అరెస్టయిన మహిళ జార్ఖండ్కు చెందిన ప్రమీలగా గుర్తించారు. అయితే.. బరేలీకి నల్లమందును డెలివరీ చేసేందుకు వెళుతున్నట్లు విచారణలో తేలింది. కాగా.. నల్లమందును ఒక్కసారి డెలివరీ చేస్తే తనకు రూ.10వేలు వచ్చేదని చెబుతుంది. డిప్యూటీ ఎస్పీ విమల్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా స్మగ్లర్ ప్రమీల జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లా బర్కాకన్నలోని పట్రాటు నివాసి. ఆమె రెండు కిలోలు నల్లమందును స్వాధీనం చేసుకున్నామని.. అంతర్జాతీయ మార్కెట్లో దాని ధర దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.2830 స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. పోలీసులు ఆమెను విచారించగా ముఠా నాయకుడు జార్ఖండ్ నివాసి ఓంవీర్ అని ప్రమీల చెప్పింది. అతను ప్రస్తుతం బరేలీలో నివసిస్తున్నాడని.. వివిధ వ్యక్తుల వద్ద నుంచి నల్లమందు కొనుగోలు చేస్తాడని తెలిపింది. ఈ క్రమంలో.. ముఠా నాయకుడు, ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ ఎస్పీ తెలిపారు. మరోవైపు.. ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) బృందం కూడా ప్రమీలను విచారించనుంది.
- Tags
- 30 lakh
- arrest
- bag
- Drugs
- telugu news
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!