Gujarat: సూరత్లోని సామూహిక ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: శనివారం గుజరాత్ సూరత్ లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. కాగా ఘటన స్థలంలో విషం బాట్టిల్ తో పాటుగా సూసైడ్ లెటర్ దొరకడంతో అందరూ అది సామూహిక ఆత్మహత్యగా భావించారు. అయితే తాజాగా ఆ ఘటనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు నిజాలు వెలుగు చూశాయి. అందరూ భావించినట్లు కుటుంభం సభ్యులు అందరూ కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడలేదు. మనీష్ సోలంకి తన కుటుంభ సభ్యులకు విషమిచ్చి చంపేశారు. అలానే అతని పెద్ద కుమార్తె మెడ పైన, అతని తల్లి మెడ పైన కూడా గొంతు నులిమి చంపిన గుర్తులు కనిపించాయి. పోస్టుమార్టం రిపోర్ట్ లో మనీష్ సోలంకితో పాటు అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక పసికందు, అతని వృద్ధ తల్లి మృతదేహాలలో విషం కనిపించింది. అయితే అతని తల్లీ, కూతురు పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఇద్దరూ చనిపోయారని తేలింది.
Read also:Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. విచారణ ప్రారంభం
Also Read
- Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
అలానే ఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ లో మనీష్ పేరు మాత్రమే ఉంది. మిగిలిన కుటంబసభ్యుల పేర్లు లేవు. కావున మనీష్ ముందుగా అందరిని చంపి తరువాత తాను చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా మనీష్ సోలంకి కుటుంబాన్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. శనివారం పాలన్పూర్ పాటియా ప్రాంతం లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్ లోని సి-2 టవర్ లోని ఫ్లాట్ నంబర్ జి-1 నుండి చెడువాసన వస్తున్న క్రమంలో స్థానికులు ఇంటి తలుపు తట్టగా ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి వచ్చి తలుపు పగలగొట్టి చూడగా.. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారి మనీష్ సోలంకి (37), అతని భార్య రీటా బెన్ సోలంకీ, తండ్రి కాను సోలంకి, తల్లి శోభన, కూతురు దిశా సోలంకి, కూతురు కావ్య సోలంకి, కుమారుడు కుశాల్ సోలంకి విగతజీవులుగా పడివున్నారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెప్పాట్టరు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!