Breaking News: కోల్కతా అత్యాచారం కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారి అరెస్ట్
- డాక్టర్పై అత్యాచారం.. హత్య కేసులో సీబీఐ కీలక చర్య
- మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్.. పోలీస్ అధికారి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్కతా పోలీస్ ఎస్హెచ్ఓ అభిజీత్ మండల్లను అరెస్టు చేసింది. గతంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్థిక మోసం, అవినీతి కేసులో అరెస్టయ్యారు. కోల్కతా అత్యాచారం, హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు అదృశ్యమైనందుకు ఇప్పుడు సీబీఐ సందీప్ ఘోష్ను అరెస్టు చేసింది. ఘోష్తో పాటు ఎస్హెచ్ఓ అభిజీత్ మండల్ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అభిజీత్ మండల్ తాలా పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా నియమితులయ్యారు.
READ MORE: CM Revanth Reddy : పార్లమెంట్లో పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారు…
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ఆర్జి కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ప్రత్యేక కేసులో సందీప్ ఘోష్ను గతంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసిన విషయం తెలిసింది. తాజాగా అత్యాచారం కేసులో సాక్ష్యాలను నాశనం చేయడం, దర్యాప్తును తప్పుదారి పట్టించడం వంటి ఆరోపణలపై సందీప్ ఘోష్, అభిజీత్ మండల్లను అరెస్టు చేశారు. సందీప్ ఘోష్కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష కూడా నిర్వహించింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించడానికి కలకత్తా హైకోర్టు గత నెలలో సిబిఐకి మూడు వారాల సమయం ఇచ్చింది. నివేదికను సెప్టెంబర్ 17న కోర్టు ముందుంచాల్సి ఉంది.
READ MORE: Budameru: బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ పుకార్లు.. స్పందించిన మంత్రి
ఇదిలా ఉండగా.. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నిరసన తెలుపుతున్న ట్రైనీ డాక్టర్ల మధ్య సమావేశం నిన్న (సెప్టెంబర్ 14) మళ్లీ వాయిదా పడింది. ట్రైనీ డాక్టర్లు సమావేశం యొక్క ప్రత్యక్ష ప్రసారం, వీడియో రికార్డింగ్ చేయాలని మొండిగా ఉన్నారు. దానిపై మమత వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సభ నిర్వహించకుండానే సీఎం నివాసం గేటు వద్ద నుంచి నిరసనకు దిగిన ట్రైనీ వైద్యులు తిరుగుముఖం పట్టారు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!