Breaking News: కోల్కతా అత్యాచారం కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారి అరెస్ట్
- డాక్టర్పై అత్యాచారం.. హత్య కేసులో సీబీఐ కీలక చర్య
- మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్.. పోలీస్ అధికారి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్కతా పోలీస్ ఎస్హెచ్ఓ అభిజీత్ మండల్లను అరెస్టు చేసింది. గతంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్థిక మోసం, అవినీతి కేసులో అరెస్టయ్యారు. కోల్కతా అత్యాచారం, హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు అదృశ్యమైనందుకు ఇప్పుడు సీబీఐ సందీప్ ఘోష్ను అరెస్టు చేసింది. ఘోష్తో పాటు ఎస్హెచ్ఓ అభిజీత్ మండల్ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అభిజీత్ మండల్ తాలా పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా నియమితులయ్యారు.
READ MORE: CM Revanth Reddy : పార్లమెంట్లో పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారు…
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ఆర్జి కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ప్రత్యేక కేసులో సందీప్ ఘోష్ను గతంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసిన విషయం తెలిసింది. తాజాగా అత్యాచారం కేసులో సాక్ష్యాలను నాశనం చేయడం, దర్యాప్తును తప్పుదారి పట్టించడం వంటి ఆరోపణలపై సందీప్ ఘోష్, అభిజీత్ మండల్లను అరెస్టు చేశారు. సందీప్ ఘోష్కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష కూడా నిర్వహించింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించడానికి కలకత్తా హైకోర్టు గత నెలలో సిబిఐకి మూడు వారాల సమయం ఇచ్చింది. నివేదికను సెప్టెంబర్ 17న కోర్టు ముందుంచాల్సి ఉంది.
READ MORE: Budameru: బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ పుకార్లు.. స్పందించిన మంత్రి
ఇదిలా ఉండగా.. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నిరసన తెలుపుతున్న ట్రైనీ డాక్టర్ల మధ్య సమావేశం నిన్న (సెప్టెంబర్ 14) మళ్లీ వాయిదా పడింది. ట్రైనీ డాక్టర్లు సమావేశం యొక్క ప్రత్యక్ష ప్రసారం, వీడియో రికార్డింగ్ చేయాలని మొండిగా ఉన్నారు. దానిపై మమత వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సభ నిర్వహించకుండానే సీఎం నివాసం గేటు వద్ద నుంచి నిరసనకు దిగిన ట్రైనీ వైద్యులు తిరుగుముఖం పట్టారు.
తాజావార్తలు
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!