Breaking News: కోల్కతా అత్యాచారం కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారి అరెస్ట్
- డాక్టర్పై అత్యాచారం.. హత్య కేసులో సీబీఐ కీలక చర్య
- మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్.. పోలీస్ అధికారి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్కతా పోలీస్ ఎస్హెచ్ఓ అభిజీత్ మండల్లను అరెస్టు చేసింది. గతంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్థిక మోసం, అవినీతి కేసులో అరెస్టయ్యారు. కోల్కతా అత్యాచారం, హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు అదృశ్యమైనందుకు ఇప్పుడు సీబీఐ సందీప్ ఘోష్ను అరెస్టు చేసింది. ఘోష్తో పాటు ఎస్హెచ్ఓ అభిజీత్ మండల్ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అభిజీత్ మండల్ తాలా పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా నియమితులయ్యారు.
READ MORE: CM Revanth Reddy : పార్లమెంట్లో పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారు…
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఆర్జి కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ప్రత్యేక కేసులో సందీప్ ఘోష్ను గతంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసిన విషయం తెలిసింది. తాజాగా అత్యాచారం కేసులో సాక్ష్యాలను నాశనం చేయడం, దర్యాప్తును తప్పుదారి పట్టించడం వంటి ఆరోపణలపై సందీప్ ఘోష్, అభిజీత్ మండల్లను అరెస్టు చేశారు. సందీప్ ఘోష్కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష కూడా నిర్వహించింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించడానికి కలకత్తా హైకోర్టు గత నెలలో సిబిఐకి మూడు వారాల సమయం ఇచ్చింది. నివేదికను సెప్టెంబర్ 17న కోర్టు ముందుంచాల్సి ఉంది.
READ MORE: Budameru: బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ పుకార్లు.. స్పందించిన మంత్రి
ఇదిలా ఉండగా.. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నిరసన తెలుపుతున్న ట్రైనీ డాక్టర్ల మధ్య సమావేశం నిన్న (సెప్టెంబర్ 14) మళ్లీ వాయిదా పడింది. ట్రైనీ డాక్టర్లు సమావేశం యొక్క ప్రత్యక్ష ప్రసారం, వీడియో రికార్డింగ్ చేయాలని మొండిగా ఉన్నారు. దానిపై మమత వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సభ నిర్వహించకుండానే సీఎం నివాసం గేటు వద్ద నుంచి నిరసనకు దిగిన ట్రైనీ వైద్యులు తిరుగుముఖం పట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!