Rice Farming: సఫలమైన సరికొత్త వరి వంగడం.. ఒకసారి నాట్లు వేస్తే 8 పంటలు
Rice Farming: దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులు పెట్టుబడులు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వరి రైతులు కూలీల కొరత, కూలీ రేట్లు ఏటా పెంపు, ఇతర ఖర్చులతో తల్లడిల్లిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమస్యలను అధిగమించే దిశగా చైనా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఒకసారి వరి నాట్లు వేస్తే వరుసగా నాలుగేళ్ల పాటు, 8సీజన్లు పంట కోతకోస్తే ఎలా ఉంటుంది. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ దీనిని చైనా శాస్త్రవేత్తలు చేతల్లో చేసి నిరూపించారు. నిజమేనండి.. ఒకసారి వరి నాట్లు వేస్తే వరుసగా 8 సీజన్ల పాటు కోత కోసే విధంగా సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు. అంటే ఒక్కసారి నాటు వేస్తే చాలు.. 8సార్లు పంట చేతికి వస్తుందన్నమాట. కోత కోసిన తర్వాత నీరు పెడితే చాలు.. అవే పిలకలపై మరోసారి పైరు పెరుగుతుంది. ఈ కొత్త వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు సాగులోకి తెచ్చారు. ‘పీఆర్23’ పేరుతో పిలుస్తున్న ఈ వంగడాన్ని ఇప్పటికే దాదాపు 40 వేల ఎకరాల్లో చైనా రైతులు సాగుచేశారు. ఎకరానికి సగటున 27 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది.
సాధారణ పద్ధతితో పోలిస్తే ఈ కొత్త వంగడంతో 60 సాగునీటిని, 58శాతం కూలీల ఖర్చును ఆదా చేయొచ్చని పరిశోధకులు వెల్లడించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చేసే ఖర్చులో 49 శాతం వరకూ కలిసొస్తుందని చైనా పరిశోధనల్లో తేలింది. 2018లో అక్కడి రైతుల సాగుకు పీఆర్23 వంగడాన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మరింతగా సాగుచేసి ప్రయోగాలు చేయాల్సి ఉంది. చైనా వృద్ధి చేసి ఆ వంగడాలు మనదేశంలో సాగు చేసేందుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించి చెప్పాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి దేశంలో వ్యవసాయ పరిశోధన సంస్థలను అడిగింది. రాజేంద్రనగర్లోని ‘భారత వరి పరిశోధన సంస్థ’ కూడా చైనా వంగడం సాగు విధానాలపై అధ్యయనం చేస్తోంది.
Also Read
Congress: కాంగ్రెస్ పార్టీ తొలి స్టీరింగ్ ప్యానెల్ సమావేశం.. ప్లీనరీ తేదీలు ఖరారు..!
సాధ్యాసాధ్యాల గురించి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ వివరించారు. మనదేశం సమశీతోష్ణ మండలంలో ఉందని.. ప్రతి 4నెలలకు ఒకసారి సీజన్ పూర్తిగా మారుతుందన్నారు. ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా ఉండడంతో పాటు తెగుళ్లు చుట్టుముడుతున్నాయన్నారు. చైనా ఆహారపు అలవాట్లతో పాటు వాతావరణం మనదేశానికి భిన్నంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మన వాతావరణం, ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని కొత్త వంగడాల సాగుకు అనుమతి ఇవ్వాలన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!