CM Revanth Reddy: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలి..
- ఇండోర్లో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నాం
- ఇది ఎన్నికల ర్యాలీ కాదు.. ఇది ఒక యుద్ధం- సీఎం రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని తెలిపారు.
Read Also: East Central Railway Recruitment 2025: రైల్వేలో 1,154 పోస్టులు.. పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్
Also Read
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
- Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
గజనీ మహమ్మద్ హిందుస్తాన్ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు… రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదు.. ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్నా బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారని అన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలని రేవంత్ రెడ్డి తెలిపారుజ
Read Also: Allu Arjun: త్రివిక్రమ్ బన్నీ స్టోరీలైన్ లీక్.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇది రెండు పరివార్ల మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఒకటి గాంధీ పరివార్… మరొకటి గాడ్సే పరివార్ అని తెలిపారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ… గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. అందుకే మనమంతా గాంధీ పరివార్గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!