MLC Kavitha: మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొలిఏకాదశి ముగిసిన తర్వాత బోనాల పండగ ప్రారంభమైవుతుంది. ఈ నెలంతా హైదరాబాద్ నగరమంతా బోనాల పండగ చేసుకుంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకం. పండగ రోజున అమ్మవారికి నిష్టగా బోనం అలంకరించి అందులో నైవేద్యం వండి డప్పుచప్పుల్లు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారికి ఘనంగా బోనం సమర్పిస్తారు.
Read Also: Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
ముఖ్యంగా అందరికి బోనాలు అంటేనే గుర్తుకు వచ్చేది గోల్కొండ, లష్కర్ బోనాలు. తెలంగాణలో ముఖ్య పండుగైనా బోనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. గతవారం గోల్కొండ బోనాలు జరగ్గా ఈ వారం లష్కర్ బోనాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు బోనాలతో వచ్చి దర్శించుకుని సందడి చేస్తున్నారు. అమ్మవారికి ఉదయం ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో పోతురాజులు నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే.. రేపు (సోమవారం) రంగం జరుగుతుంది. మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పంచి ప్రత్యేక పూజలు చేశారు.
Read Also: Bandla Ganesh: సిగ్గు లేదా.. మీకు జీవితంలో బుద్ధి రాదు.. మీ బతుకులు చెడ
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ లో నిర్వహించిన పూజలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అయితే.. ఎమ్మెల్సీ కవితకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పండితులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
Read Also: Health Tips : ఈ స్మూతీని రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలో..
బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ శ్రేణులతో భారీ బందోబస్తుతో ఆలయానికి వచ్చారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా బోనం ఎత్తుకుని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆమె వెంట బీఆర్ఎస్ నేతలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇక, మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు ఉజ్జయినీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. కేసీఆర్ తో పాటు మంత్రులు తలసాని, ఇంద్రకరణ రెడ్డి, ఆలయాధికారులు పూర్ణకుంభంతో సీఎం దంపతులకు స్వాగతం పలికారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!