Operation: త్రీ ఇడియట్ సినిమా సీన్ రిపీట్.. చనిపోయిన గర్భిణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation: సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని జనాలు మర్చిపోతున్నారు. సినిమాల్లో లాగా చేయాలన్న తాపత్రయంలో కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలపైకి తెచ్చుకోవడంతో పాటు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే బీహర్ లోని పూర్ణియా జిల్లాలో జరిగింది. అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ సినిమాలో చూపించిన విధంగా.. నిజ జీవితంలో డార్టర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ నర్సు ఓ గర్భిణికి ప్రసవం చేసి.. ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. మాల్తీ దేవి(22) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సోమవారం సాయంత్రం పూర్ణియా లైన్ బజార్లోని సమర్పణ్ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ సీమా కుమారి హాస్పిటల్ లో లేరు. ఆమె నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆ మహిళను హాస్పిటల్ మేనేజ్ మెంట్ అడ్మిట్ చేసుకుంది.
Read Also:New York: న్యూయార్క్లో తీవ్ర స్థాయిలో కాలుష్యం
Also Read
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ఈ క్రమంలోనే మాలతికి తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. ఓ నర్సుకు ఆపరేషన్ చేయాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆమె డాక్టర్ సీమా కుమారికి వీడియో కాల్ చేసింది. ఆమె సూచనల ఆధారంగా ఆపరేషన్ అయితే పూర్తిచేసింది. మాలతికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కానీ ఆ నర్సు ఆమెకు తెలియకుండానే పేషెంట్ కడుపులోని ముఖ్య నరాన్ని కట్ చేసింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారి మరణించింది. ఆ మహిళ జన్మనిచ్చిన ఇద్దరు శిశువులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఖాజాంచి సహాయక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రంజిత్ కుమార్ తన పోలీసు బృందంతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి శాంతిభద్రతలను పునరుద్ధరించారు.
Read Also:Honda Car: హోండాలో ఈ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్..
బాధితురాలి కుటుంబం నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. దాన్ని పూర్ణియాలోని సివిల్ సర్జన్ ఆఫీసుకు పంపించామని తెలిపారు. ఈ విషయాన్ని పూర్ణియా సివిల్ సర్జన్ దర్యాప్తు చేసి, వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే డాక్టర్, ఆసుపత్రి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఎస్ హెచ్ వో వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో జన అధికార్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ ఎంపీ పప్పుయాదవ్ హాస్పిటల్ కు చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్ సర్జన్, ఎస్ హెచ్ వోను కోరారు.
తాజావార్తలు
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!