Eyes: కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ ఆహారాలు తిన్నాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eyes: ఈ రోజుల్లో బతకాలంటే ఉద్యోగం ప్రతి మనిషికి చాలా అవసరం. కుటుంబాన్ని పోషించాలంటే ఒక ఉద్యోగం సరిపోదు కాబట్టి.. కొందరు ఫుల్ టైం జాబ్ తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటారు. అయితే ఉద్యోగం చేసేవారు కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సిందే.. కాగా మరికొందరు మొబైల్ ఫోన్ ద్వారా కూడా వర్క్ చేస్తుంటారు. దాంట్లో సంస్థ యాప్ ద్వారా పనులు చకచకా చేస్తుంటారు. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా కంప్యూటర్లు, మొబైల్ ఫోల్ స్క్రీన్ల వైపు చూస్తూ గడిపాల్సిన పరిస్థితి వస్తుంది. దీని కారణంగా, కంటి చూపు బలహీనపడటం ప్రారంభమవుతుంది. వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగిస్తుంది. కానీ చాలా మంది కంటి చూపును కాపాడుకోవడంపై శ్రద్ధ చూపరు. కంటి సమస్యలు తీవ్రమయిన తర్వాత ఆసుపత్రులకు వెళుతున్నారు. అయితే మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు ఏమి చేయవచ్చు, ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
Read also: Supriya Sule: ఎన్సీపీని నడిపించే అర్హత నాకే ఉంది..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
కంటి ఆరోగ్యానికి ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే, సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి. దుంపలు, నారింజ వంటి పండ్లలో కళ్లకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. నారింజలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు కెరోటినాయిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్లోని పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం చేప. చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆకుకూరలను ఆహారంలో చేర్చుకుంటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పాలకూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Read also: Uttarpradesh : పేకముక్కలా కూలిన హర్డోయ్లో బ్రిడ్జ్.. ఇరుక్కుపోయిన ట్రక్
బాదం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదంపప్పులను నానబెట్టి రెండు పప్పులను క్రమం తప్పకుండా తింటే కళ్లకు మేలు చేస్తుంది. గుడ్లు మరియు చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహారాలు. గ్రోట్స్లో జింక్ మరియు విటమిన్ ఎ ఉంటాయి. ఇది కళ్ళకు మంచిది. చికెన్లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మనం ఆహారంలో టమోటాలు చేర్చుకోవడం వల్ల మేలు జరుగుతుంది. టొమాటోలో లైకోపీన్ ఉంటుంది, ఇది మన కంటి చూపును కాపాడుతుంది. కంటి చూపు మెరుగుపడేందుకు ఈ ఆహారాలు తీసుకోవడంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసే వారు గంటకోసారి విరామం తీసుకుంటూ కంటికి చిన్నపాటి వ్యాయామాలు చేయడం మంచిది.
Uttarpradesh : పేకముక్కలా కూలిన హర్డోయ్లో బ్రిడ్జ్.. ఇరుక్కుపోయిన ట్రక్
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..