Hyderabad: ప్రాణం తీసిన పాత కక్షలు.. కులుసుంపుర పరిధిలో దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: IPL 2024 Auction: విరాట్ కోహ్లీ వేలంలోకి వస్తే రూ.42 కోట్లు.. జస్ప్రీత్ బుమ్రాకు రూ.35 కోట్లు పక్కా!
Also Read
జియగూడకు చెందిన గోపి.. పాతక్షకల కారణంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఈ హత్య చేశాడు. జియగూడ సోన టిఫిన్ సెంటర్ ఎదురు వీధిలో ఉన్న డస్ట్ బిన్ వద్ద పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టాడు. అంతేకాకుండా.. అనిల్ ను హత్య చేసిన అనంతరం జియగూడలో అర్థరాత్రి నిందితుడు హల్చల్ చేశాడు. నరికిన చేతితో వీధి మొత్తం తిరిగాడు. ఈరోజు తెల్లవారుజామున డస్ట్ బిన్ వద్ద మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం నిందితుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Yatra 2: జగన్ బర్త్ డే రోజున ‘యాత్ర 2’ కొత్త పోస్టర్ రిలీజ్…
ఈ ఘటనపై.. కులుసుంపురా సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 8గంటలకి 100 దయాళ్ ద్వారా సమాచారం అందిందని తెలిపారు. స్థానిక జీహెచ్ఎంసి సిబ్బంది సమాచారం ఇచ్చారని అన్నారు. మరోవైపు.. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు.. 100 శాతం పూర్తిగా కాలిపోయిందని సీఐ తెలిపారు. పాతక్షకల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం.. హత్య కేసులో ఎంత మంది ప్రమేయం ఉంది.. పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన తరువాత తెలుస్తుందని సీఐ చెప్పారు. హత్య చేసి ఆనవాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు నిప్పు పెట్టి తగలబెట్టారని సీఐ అన్నారు.
- Tags
- Brutal
- fire
- hyderabad
- Kulsumpura
- murder
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?