Hyderabad: ప్రాణం తీసిన పాత కక్షలు.. కులుసుంపుర పరిధిలో దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: IPL 2024 Auction: విరాట్ కోహ్లీ వేలంలోకి వస్తే రూ.42 కోట్లు.. జస్ప్రీత్ బుమ్రాకు రూ.35 కోట్లు పక్కా!
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
జియగూడకు చెందిన గోపి.. పాతక్షకల కారణంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఈ హత్య చేశాడు. జియగూడ సోన టిఫిన్ సెంటర్ ఎదురు వీధిలో ఉన్న డస్ట్ బిన్ వద్ద పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టాడు. అంతేకాకుండా.. అనిల్ ను హత్య చేసిన అనంతరం జియగూడలో అర్థరాత్రి నిందితుడు హల్చల్ చేశాడు. నరికిన చేతితో వీధి మొత్తం తిరిగాడు. ఈరోజు తెల్లవారుజామున డస్ట్ బిన్ వద్ద మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం నిందితుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Yatra 2: జగన్ బర్త్ డే రోజున ‘యాత్ర 2’ కొత్త పోస్టర్ రిలీజ్…
ఈ ఘటనపై.. కులుసుంపురా సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 8గంటలకి 100 దయాళ్ ద్వారా సమాచారం అందిందని తెలిపారు. స్థానిక జీహెచ్ఎంసి సిబ్బంది సమాచారం ఇచ్చారని అన్నారు. మరోవైపు.. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు.. 100 శాతం పూర్తిగా కాలిపోయిందని సీఐ తెలిపారు. పాతక్షకల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం.. హత్య కేసులో ఎంత మంది ప్రమేయం ఉంది.. పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన తరువాత తెలుస్తుందని సీఐ చెప్పారు. హత్య చేసి ఆనవాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు నిప్పు పెట్టి తగలబెట్టారని సీఐ అన్నారు.
- Tags
- Brutal
- fire
- hyderabad
- Kulsumpura
- murder
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!