ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి భార్యభర్తులు విడిపోయేందుకు రెడీ అవుతున్నారు. గతంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అందరు దాంపత్య జీవితం కొనసాగించే వారు.. కానీ మారుతున్న జీవణశైలికి వారు అలవాటు పడి తమ ఇష్టం వచ్చినట్లు విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లైన మూడునాళ్లకే మూడు ముళ్ల బంధం విడిపోతుంది.
Read Also: LIC: ఆ ఏ జెంట్లకు, ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం..
అయితే, కేరళలో ఓ మూర్ఖుడు టెక్నాలజీ సహాయంతో తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అమ్మో అందేంటి అలా ఎలా ఇస్తారు.. అని మీరు ఆశ్చర్యపోతున్నారా?.. విదేశాల్లో ఉన్న అతడు తన భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు.. ఆమెకు విడాకులు ఇచ్చినట్టు తెలియజేశాడు. ఇద్దరు కూతుళ్లను కన్న తర్వాత సింపుల్గా మూడు సార్లు ట్రిఫుల్ తలాఖ్ అని చెప్పి విడాకులు ఇచ్చినట్టు క్లారిటీ ఇచ్చాడు. దీంతో అతని మాటలకు నిర్ఘాంతపోయిన సదరు వివాహిత పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసింది.
Read Also: Sreemukhi : లంగావోణిలో ఎంత అందంగా ఉన్నావ్ శ్రీముఖి..అలా నవ్వితే పడిపోతారంతే…
కేరళలోని దక్షిణ కన్నడ జిల్లా జయనగర్కు చెందిన బాధితురాలిని త్రిస్సూర్కు చెందిన అబ్దుల్ రషీద్ ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. అయితే, రషీద్ విదేశాల్లో పని చేస్తున్నాడు.. పెళ్లయ్యాక ఆమెను కూడా ఓవర్సీస్ తీసుకెళ్లాడు. ఇరువురు అక్కడే రెండేళ్ల పాటు జీవనం కొనసాగించారు. ఆ తర్వాత ఆమె రెండో డెలివరీ కోసం సల్లియాకు తీసుకువచ్చి వదిలిపెట్టి మళ్లీ రషిద్ అబ్రాడ్ వెళ్లిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. అయితే.. పెద్దమనుషులు సర్ది చెప్పారు.. కానీ, అతను తన పట్టు విడవలేదు.. తాజాగా, వాట్సాప్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పడంతో ఆమె సల్లియా పోలీసు స్టేషన్లో భర్త రషిద్ పై ఫిర్యాదు చేసింది.. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.