Maharastra : పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి.. బిల్డింగ్ పై దూకాడు
Maharastra : మహారాష్ట్రలోని థానేలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడు. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ల బెడద ఎక్కువయ్యింది. దీనిని నివారించడానికి మహారాష్ట్ర పోలీసులు, ఏటీఎస్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు గట్టి చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జూలైలో మొరాదాబాద్ పోలీసులు అక్రమ అంతర్జాతీయ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ను ఛేదించి నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను కనిపెట్టి అరెస్టు చేశారు. అయితే తాజాగా థానే జిల్లాలోని భివాండి ప్రాంతంలోని ఓ భవనంలోని ఐదో అంతస్తులో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉందని సమాచారం వారికి అందింది. దీంతో శనివారం సాయంత్రం పోలీసులు, ఏటీఎస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నిందితుల్లో ఒకరు పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు పరిగెత్తి భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.
Read Also: Sai Dharam Tej: ఒక్క హిట్ కొట్టగానే రెండు సీక్వెల్స్ కి రెడీ…
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే వారికి ఆశ్రయం ఇచ్చిన ఫ్లాట్ యజమాని పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ లభించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని థానే పోలీసులు తెలిపారు. కాగా.. గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు ఈ నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చేవారని మొరాదాబాద్ ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. వీరు సిమ్ బాక్సుల ద్వారా వీవోఐపీ కాల్స్ ను జీఎస్ ఎం కాల్స్ గా మార్చేవారని చెప్పారు. నిందితులను మహ్మద్ కలీం, అతని సోదరుడు మహ్మద్ మెహరాజ్ గా గుర్తించామని చెప్పారు. వారి నుంచి 550 సిమ్ కార్డులు, రూ.63 వేలు స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Puducherry : తాగి వచ్చి కొడుతున్నాడని.. మొగుడిపై కిరోసిన్ పోసి నిప్పంటిన భార్య
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!