NTV Telugu Site icon

Fire Accident: తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..

Hyd Fire

Hyd Fire

హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదే విధంగా మంటలు చెలరేగినప్పుడు కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్ల పై అగ్ని కీలలు పడటంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో.. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన పర్యాటక శాఖ ఎండీని మనోహర్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా.. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read Also: Minister Meruga Nagarjuna: జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి..

ఇదిలా ఉంటే.. పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాద స్థలాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించి, పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని ఆయన ఆరోపించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని కీలకమైన ఫైల్స్ ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందనే కారణం వల్లే ఈ ప్రమాదాన్ని సృష్టించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి బాగోతం బట్టబయలు కాకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లే ఎన్నికల కమిషన్ ఆయన్ను సస్పెండ్ చేసిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రమేయం పై విచారణ చేయాలి.. ఈ ఘటనపై హైలెవల్ ఎంక్వయిరీ చేయించాలి… అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.