Parking Car: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ..
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 34 ఏళ్ల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైనట్లు అధికారి ఒకరు తెలిపారు. కారులోనే నిప్పంటించుకోవడానికి ప్రయత్నించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వాహనంలో మంటలు చెలరేగకపోవడంతో అతనికి హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుండి రక్తస్రావం అయ్యి ఊపిరాడక చనిపోయాడని వివరాలు తెలిపారు. మృతుడు లజ్పత్ నగర్ ప్రాంతంలోని దయానంద్ కాలనీకి చెందిన ధ్రువ్ మహాజన్గా అధికారులు గుర్తించారు.
Delhi: శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. తాజా పరిణామాలపై చర్చ
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
ఈ కేసు సంబంధించి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో మాట్లాడుతూ.., గురువారం ఉదయం 9:40 గంటలకు విషయం పోలీసు కంట్రోల్ రూమ్ (పిసిఆర్)కి అందింది. ఒక పార్క్ చేసిన కారులో మృతదేహం, దాని చుట్టూ రక్తం చిమ్ముతూ లోపల పడి ఉందని తెలిపారు. నెహ్రూ ప్లేస్లోని దేవికా టవర్ పక్కన పహద్పూర్ బిజినెస్ సెంటర్ ముందు ఉన్న సంఘటనా స్థలానికి చేరుకోగా, డ్రైవర్ సీటుపై రక్తంతో మృతదేహం కనిపించింది.
కారు అన్ని వాకిళ్లు లాక్ చేయబడి ఉన్నందున, వెనుక అద్దాలు పగలగొట్టి కారు తెరవగా., ముఖం, తొడ, రెండు చేతులపై కాలిన గాయాలతో వ్యక్తి స్టీరింగ్ వీల్పై చనిపోయినట్లు గుర్తించబడిందని తెలిపారు. కారులోపల పెట్రోలు వాసన వస్తోందని, మృతుడి వెంట్రుకలు పూర్తిగా పాడైపోయాయని, స్టీరింగ్ పాక్షికంగా కాలిపోయిందని.. టీషర్టులో మసి ఉందని డీసీపీ తెలిపారు. ముందు సీటులో వాడిన వాటర్ బాటిల్, ఉపయోగించిన అగ్గిపుల్లలు కూడా ఉన్నాయని., ఆ తర్వాత ఏరియా సిసిటివిని యాక్సెస్ చేయగా, మృతుడు తెల్లవారుజామున 3:30 గంటలకు తన కారులో సంఘటనా స్థలానికి వచ్చినట్లు నిర్దారణ అయ్యింది. ఏడు నిమిషాల తరువాత, కారులో భారీ మంటలు రాగా., ఆ తరువాత ఒక నిమిషం తర్వాత తగ్గిపోయిందని చెప్పారు.
Navdeep: 23 ఏళ్లలో రకరకాల మనుషులను ప్రేమించా.. అలాంటి అమ్మాయే కావాలి: నవదీప్ ఇంటర్వ్యూ
ధ్రువ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, ఆ తర్వాత మృతుడు హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం అయ్యి, ఊపిరాడక మృతి చెందాడని డీసీపీ తెలిపారు. విచారణలో, బెంగళూరులో నివసిస్తున్న మృతుడి సోదరి పూర్వి మహాజన్, ధ్రువ్ భారీ అప్పుల్లో ఉన్నాడని తెలియజేసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి విచారణ ప్రక్రియను చేపట్టారు.
తాజావార్తలు
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
-
Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
-
Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
-
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!