Parking Car: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 34 ఏళ్ల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైనట్లు అధికారి ఒకరు తెలిపారు. కారులోనే నిప్పంటించుకోవడానికి ప్రయత్నించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వాహనంలో మంటలు చెలరేగకపోవడంతో అతనికి హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుండి రక్తస్రావం అయ్యి ఊపిరాడక చనిపోయాడని వివరాలు తెలిపారు. మృతుడు లజ్పత్ నగర్ ప్రాంతంలోని దయానంద్ కాలనీకి చెందిన ధ్రువ్ మహాజన్గా అధికారులు గుర్తించారు.
Delhi: శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. తాజా పరిణామాలపై చర్చ
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
ఈ కేసు సంబంధించి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో మాట్లాడుతూ.., గురువారం ఉదయం 9:40 గంటలకు విషయం పోలీసు కంట్రోల్ రూమ్ (పిసిఆర్)కి అందింది. ఒక పార్క్ చేసిన కారులో మృతదేహం, దాని చుట్టూ రక్తం చిమ్ముతూ లోపల పడి ఉందని తెలిపారు. నెహ్రూ ప్లేస్లోని దేవికా టవర్ పక్కన పహద్పూర్ బిజినెస్ సెంటర్ ముందు ఉన్న సంఘటనా స్థలానికి చేరుకోగా, డ్రైవర్ సీటుపై రక్తంతో మృతదేహం కనిపించింది.
కారు అన్ని వాకిళ్లు లాక్ చేయబడి ఉన్నందున, వెనుక అద్దాలు పగలగొట్టి కారు తెరవగా., ముఖం, తొడ, రెండు చేతులపై కాలిన గాయాలతో వ్యక్తి స్టీరింగ్ వీల్పై చనిపోయినట్లు గుర్తించబడిందని తెలిపారు. కారులోపల పెట్రోలు వాసన వస్తోందని, మృతుడి వెంట్రుకలు పూర్తిగా పాడైపోయాయని, స్టీరింగ్ పాక్షికంగా కాలిపోయిందని.. టీషర్టులో మసి ఉందని డీసీపీ తెలిపారు. ముందు సీటులో వాడిన వాటర్ బాటిల్, ఉపయోగించిన అగ్గిపుల్లలు కూడా ఉన్నాయని., ఆ తర్వాత ఏరియా సిసిటివిని యాక్సెస్ చేయగా, మృతుడు తెల్లవారుజామున 3:30 గంటలకు తన కారులో సంఘటనా స్థలానికి వచ్చినట్లు నిర్దారణ అయ్యింది. ఏడు నిమిషాల తరువాత, కారులో భారీ మంటలు రాగా., ఆ తరువాత ఒక నిమిషం తర్వాత తగ్గిపోయిందని చెప్పారు.
Navdeep: 23 ఏళ్లలో రకరకాల మనుషులను ప్రేమించా.. అలాంటి అమ్మాయే కావాలి: నవదీప్ ఇంటర్వ్యూ
ధ్రువ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, ఆ తర్వాత మృతుడు హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం అయ్యి, ఊపిరాడక మృతి చెందాడని డీసీపీ తెలిపారు. విచారణలో, బెంగళూరులో నివసిస్తున్న మృతుడి సోదరి పూర్వి మహాజన్, ధ్రువ్ భారీ అప్పుల్లో ఉన్నాడని తెలియజేసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి విచారణ ప్రక్రియను చేపట్టారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..